Switch to English

Pawan Kalyan: పది వేల కోట్లతో అయినా పార్టీ నడవదు: జనసేనాని పవన్ కళ్యాణ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: ‘వెయ్యి కోట్లకు ప్యాకేజీ మాట్లాడేశారంట.. అంటూ ఎవరెవరో ఏవేవో మాట్లాడేస్తున్నారు. వంద కోట్లు, వెయ్యి కోట్లతో రాజకీయాలు చెయ్యడం మన వల్ల కాదు.! డబ్బులతో పార్టీని నడపలేం. పది వేల కోట్లు అయినా పార్టీని నడుపుతామంటే కుదరని పని..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటీవల ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన ఆరోపణలపై తనదైన స్టయిల్లో కౌంటర్ ఎటాక్ చేశారు.

అంతే కాదు, ‘20 సీట్లకు టీడీపీతో పొత్తు కుదిరిపోయిందంటూ కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయ్.. ఎలాంటి లోపాయకారీ ఒప్పందాలకూ ఆస్కారమే లేదు. జనసైనికుల ఆత్మగౌరవానికి భంగం కలిగే ఎలాంటి నిర్ణయమూ తీసుకోను..’ అంటూ జనసేన అధినేత పొత్తుల వ్యవహారంపైనా క్లారిటీ ఇచ్చేశారు.

‘మనం రాజకీయం చేస్తున్నది ప్రజల్ని పల్లకీ ఎక్కించడానికి. అధికారానికి దూరంగా వున్న ప్రజల్ని అధికార పీఠం వైపు నడిపించేందుకే జనసేన పార్టీ పుట్టింది..’ అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘అభిమానులు చప్పట్లు కొట్టేస్తే ముఖ్యమంత్రినైపోతానని అనుకోవడంలేదు.. చప్పట్లు కొట్టినవాళ్ళంతా ఒట్లేయకపోవచ్చు..’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

‘పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేవారికి ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఏవో ఆశించి పార్టీలోకి వస్తామంటే, అలాంటివాళ్ళను ఎంటర్టైన్ చేయం..’ అని జనసేన అధినేత తేల్చి చెప్పారు. ప్రజల కోసం పనిచేసే నాయకులే జనసేనలో వుంటారన్న జనసేనాని, ఎన్నికల సమయంలో పదునైన వ్యూహాలు అమలు చేస్తామని చెప్పారు.

బీసీలు, కాపులు ఒక్కతాటిపైకి రావాలని ఆకాంక్షిస్తూనే, ఇప్పటిదాకా అధికారం పంచుకున్న కులాల్ని విమర్శించాల్సిన పనిలేదనీ, అందర్నీ కలుపుకుపోవడం ముఖ్యమని జనసేన అధినేత, జనసైనికులకి సూచించారు. ఉన్నత ఆశయాలతో జనసేన ఆవిర్భవించిందనీ, లక్ష్యాన్ని ముద్దాడే క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తప్పవనీ, కాపు సామాజిక వర్గానికి చెందిన తాను ఓడితే, కాపు కులానికి చెందినవారే తూలనాడారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...