నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను కలుసుకుంటూ ఉన్న పవన్ కళ్యాణ్ మొదటి రోజు కృష్ణ గుంటూరు.. రెండవ రోజు చిత్తూరులో పర్యటించాడు. నేడు శ్రీకాళహస్త నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. తొట్టంబెడు మండలం పొయ్య గ్రామం వద్ద వైకాపా జనసేన కార్యకర్తల మద్య బాహాబాహి జరిగింది. తమ ప్రాంతంలో పర్యటించేందుకు ఒప్పుకోం అంటూ వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు అడ్డుకోవడంతో జనసేన నాయకులకు మరియు వారికి గొడవ జరిగింది.
పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. కొద్ది సమయం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసుల రంగ ప్రవేశంతో మొత్తం శాంతించారు. వైకాపా నాయకులు మరియు కార్యకర్తలను అక్కడ నుండి పంపించారు. రేపు కూడా పవన్ పర్యటన కొనసాగబోతుంది. నివార్ తుఫాన్ కారణంగా ఏపీలోని 10 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. రైతులను కౌలు రైతులను కూడా ఆదుకోవాలంటూ జగన్ ప్రభుత్వంను పవన్ డిమాండ్ చేశాడు.
680049 538617Youll find some fascinating points in time in this post but I do not know if I see all of them center to heart. Theres some validity but I will take hold opinion until I appear into it further. Great post , thanks and we want much more! Added to FeedBurner too 134263