Switch to English

గ్రౌండ్ రిపోర్ట్: జనసేన ప్రజా ప్రతినిథుల పని తీరు ఎలా వుంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,768FansLike
57,764FollowersFollow

పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సహా, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వరకు.. గడచిన రెండు నెలల్లో జనసేన ఎమ్మెల్యేల పని తీరు ఎలా వుంది.? అన్న విషయమై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒకే ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచారు.. అయితే, ఆయన ఆ తర్వాత అప్పటి అధికార వైసీపీలోకి దూకేశారు. కానీ, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేగా, ఇద్దరు ఎంపీలుగా గెలిచారు. టీడీపీ – బీజేపీతో కలిసి జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారం పంచుకుంది. కేంద్రంలోనూ ఎన్డీయే కూటమిలో మిత్రపక్షంగా వుంది జనసేన.

ఇంతకీ, రాష్ట్రంలో జనసేన ఎమ్మెల్యేల పని తీరు ఎలా వుంది.? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా, మొత్తంగా ముగ్గురు మంత్రుల పని తీరు ఎలా వుంది.? ఈ విషయమై జనసైనికులు ఏమనుకుంటున్నారు.? సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు.?

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మిగతా ఎమ్మెల్యేలతో పోల్చితే చాలా దూకుడుగా వున్నారన్నది జనసైనికుల్లో వినిపిస్తున్న వాదన. మహిళా ప్రజా ప్రతినిథి అయి వుండీ, ఆమె ప్రదర్శిస్తున్న దూకుడుకి జనసైనికులు అదనపు మార్కులు ఇస్తున్నారు.

కాగా, ఓ వైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే, ఇంకో వైపు తనను గెలిపించిన పిఠాపురంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చిత్తశుద్ధికి సాధారణ ప్రజానీకం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇటు మంత్రిగానూ, అటు ఎమ్మెల్యేగానూ.. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సైతం, అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే అని కాదు.. ఒకరు తక్కువ, ఇంకొకరు ఎక్కువ.. అని కూడా కాదు.. మొత్తంగా చూస్తే, జనసేన ప్రజా ప్రతినిథులంతా, తమ బాధ్యతల్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారన్నది ఆయా నియోజకవర్గాల నుంచి వినిపిస్తోన్న వాదన.

కాగా, ఒకరిద్దరు జనసేన ఎమ్మెల్యేలని వైసీపీ టార్గెట్ చేయడం, ఆ ఎమ్మెల్యేల పనితీరుపై ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ చూపించలేకపోతోంది. అయితే, ఆయా నియోజకవర్గాల్లో కొంత అలజడికి అయితే వైసీపీ మార్కు రాజకీయాలు కారణమవుతున్నాయన్నది నిర్వివాదాంశం.

టీడీపీ – బీజేపీకి చెందిన క్యాడర్‌తో జనసేన ప్రజా ప్రతినిథులకి ఎక్కడా పెద్దగా ఇబ్బందులు కనిపించడంలేదు. ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం.. టీడీపీ, బీజేపీతో జనసేన శ్రేణులు స్నేహపూర్వకంగా కలిసిపోవడానికి కారణమవుతోంది.

అసలు గెలుస్తారా.? లేదా.? అన్న అనుమానాలున్న జనసేన అభ్యర్థుల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఒకరు. ఆయన కూడా అంచనాలకు మించి, పనితీరు ప్రదర్శిస్తున్నారు. తిరుపతిలో మాత్రం, జనసేనలోనే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తోంది. రైల్వే కోడూర్ విషయంలోనూ ఇదే భావన వ్యక్తమవుతోంది.

రాజమండ్రి, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఎమ్మెల్యేలతోపాటు, ఉమ్మడి విశాఖలోనూ జనసేన ఎమ్మెల్యేలకు స్థానిక ప్రజల నుంచి మంచి మార్కులే పడుతున్నాయి.

ఇదిలా వుంటే, ‘ఉచిత ఇసుక’ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేల మీద బురద చల్లుతున్నట్లే, జనసేన ఎమ్మెల్యేల మీద కూడా బురద చల్లేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలూ చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన – బీజేపీ – టీడీపీ శ్రేణుల మధ్య పుల్లలు పెట్టేందుకు వైసీపీ, వైసీపీ అను‘కుల’ మీడియా చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికైతే బెడిసికొడుతూనే వున్నాయి.

2 COMMENTS

సినిమా

Geethanjali: ప్రేమకథే కానీ, దృశ్యకావ్యం.. నిత్య యవ్వన ‘గీతాంజలి’కి 36 ఏళ్లు

Geethanjali: సినిమాలకు క్రౌడ్ పుల్లర్స్ యూత్. సినిమాకి ఎవర్ గ్రీన్ కంటెంట్ లవ్. రెండింటికీ అవినాభావ సంబంధమే ఉంది. అందుకే ప్రేమకథలది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా....

నితిన్ తమ్ముడు మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

నితిన్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తూ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ...

ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించడమే..

పవన్ కల్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై గుడ్ న్యూస్ వచ్చింది. మూవీ షూటింగ్...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో...

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో...

ఎన్టీఆర్- నీల్ సినిమాలో శ్రద్ధా కపూర్..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది....

రాజకీయం

‘P-4″ పాలసీపై విషం.. వైసీపీ సానుకూల మీడియా ఉన్మాదం

కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు.. కొందరు పేదలకు మార్గదర్శకులుగా మారి వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే "P-4". మొదటినుంచి దీనిపై వైసీపీ సానుకూల మీడియా విషం చిమ్ముతూనే ఉంది....

మార్పు మంచిదే: అమర వీరుడి కుటుంబానికి వైఎస్ జగన్ పాతిక లక్షల సాయం.!

మొన్నేమో, తన నియోజకవర్గ పరిధిలో అరటి రైతులు నష్టపోతే, దాదాపు కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారట. అంతకు ముందెన్నడూ...

AP Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం..! భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

AP Liquor scam: రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం జరిగింది. కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు మైసూరులో అరెస్టు చేశారు. ప్రస్తుతం...

YS Jagan: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..? తీరు మారని జగన్ పరామర్శ!

YS Jagan: "నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.." అని సామెత. ఎవరేమనుకున్నా.. సమాజం నవ్వినా.. విమర్శించినా నాకనవసరం అనుకునే తీరు కొందరికే సాధ్యం. పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని పలకరించడం తప్పుకాదు.. నవ్వుతూ పలకరించడమే పెద్ద...

పాకిస్తాన్ బతకాలంటే, తీవ్రవాదం చావాల్సిందే: ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరిక

ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. స్వల్ప విరామం అంతే.! పాకిస్తాన్ వైపు నుంచి ఒక్క తీవ్రవాది, ఎలాంటి ఘాతుకానికి పాల్పడినా, ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా వుంటుంది. నదిలో నీళ్ళు, రక్తం.. ఒకేసారి పారేందుకు...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: పోలీసులంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎందుకంత భయం.?

‘మా జగనన్న ఇస్తున్న వార్నింగ్ అదిరింది.. పోలీసులకు ముందు ముందు చుక్కలే..’ అంటోంది వైసీపీ క్యాడర్. వారానికోసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కి రావడం, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమవడం,...

Geethanjali: ప్రేమకథే కానీ, దృశ్యకావ్యం.. నిత్య యవ్వన ‘గీతాంజలి’కి 36 ఏళ్లు

Geethanjali: సినిమాలకు క్రౌడ్ పుల్లర్స్ యూత్. సినిమాకి ఎవర్ గ్రీన్ కంటెంట్ లవ్. రెండింటికీ అవినాభావ సంబంధమే ఉంది. అందుకే ప్రేమకథలది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా. యువత ధియేటర్లకు పరుగులు పెడతారు. ఫ్యామిలీ...

దేశంలోనే స్ఫూర్తి వంతమైన నేతగా పవన్ కల్యాణ్‌..

ఇండియాలో చాలా మంది పవర్ ఫుల్ లీడర్లు ఉన్నారు. అయితే ప్రతి ఏడాది బలమైన లీడర్ల లిస్టు తీస్తే అందులో కొందరు మాత్రమే కనిపిస్తారు. ఇక ఈ ఏడాది అలాంటి లీడర్ల లిస్ట్...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో వీడియో

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన వేడుకకు చిరంజీవి-సురేఖ దంపతులతోపాటు ఉపాసన,...

Ram Charan: క్వీన్ ఎలిజబెత్-II తర్వాత రామ్ చరణ్ కే ఆ గౌరవం.. అదేంటో తెలుసా?

Ram Charan: లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటైంది. దీంతో భారతదేశంలోని అతికొద్దిమంది సెలబ్రిటీలు దక్కించుకున్న గౌరవాన్ని రామ్ చరణ్ సైతం...