వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను పెద్ద ఎత్తున తీసుకొచ్చి.. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఐటీ విభాగం రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్, బెంగళూరులో ఐటీ అభివృద్ధి జరిగింది. రాయలసీమలో ఐటీ అభివృద్ధి ఎందుకు చేయరని అక్కడి యువత ప్రశ్నిస్తున్నారు. ఐటీ పాలసీ పేరుతో ఓట్లు దండుకోవడం కాదు. దావోస్ వెళ్లి ఫొటోలు దిగితే పెట్టుబడులు రావు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి.. ఎంతమందికి ఉపాధి కల్పించారని జనసేన తరపున ప్రశ్నిస్తున్నా’.
‘అనుభవం లేకుండా పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే ఉంటుంది. పదవి వెతుక్కుంటూ రావాలి. దాని వెంట పడకూడదు. పదవి మన ప్రయాణంలో భాగం కావాలి. మనలో సత్తా, స్థాయి ఉన్నాయంటే ప్రజలే అవకాశం ఇస్తారు’ అని అన్నారు.
796695 317375Some actually marvellous work on behalf with the owner of this internet web site , perfectly excellent content material . 306354
148115 881436I only wish that I had the ability to convey what I wanted to say in the manner which you have presented this info. Thanks. 145123
416767 783108if this post was likened to a flavor of yogurt, what flavor would it be? Banana, I believe. 701567
564187 559787Totally pent topic matter, regards for entropy. 35585
199641 197532Quite clean internet site , thanks for this post. 665953