శ్యామల కామెంట్‌కు జనసేన దిమ్మదిరిగే కౌంటర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్‌సీపీ నేత ఆరే శ్యామల చేసిన వ్యాఖ్యలకు జనసేన నుంచి దిమ్మదిరిగే స్థాయిలో ఘాటైన కౌంటర్ రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.

కులం, మతం, లడ్డు, కల్తీ, నెయ్యి వంటి అంశాలతో రెండేళ్లుగా ప్రజల దృష్టిని మళ్లించారని ఆరే శ్యామల విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి, మహిళా రక్షణ, విద్య, వైద్యం, సేద్యం, ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాలపై చర్చ జరగకుండా చేశారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యల్లో పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌పై వ్యంగ్య స్వరాలు వినిపించాయి.

శ్యామల కామెంట్‌కు జనసేన దిమ్మదిరిగే కౌంటర్

అయితే ఈ వ్యాఖ్యలకు జనసేన శతఘ్ని టీం నుంచి వచ్చిన సమాధానం రాజకీయ వేడి పెంచింది. పవిత్ర ప్రసాదం కల్తీ అయితే ప్రశ్నించకూడదా అని ప్రశ్నిస్తూ, దానిని కులం, మతం పేరుతో మసకబార్చడం సరికాదని స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి ని వీడియో ద్వారా చెప్పారు. ప్రజా పదవులు విమర్శల కోసం కాదని, బాధ్యతతో వ్యవహరించాలంటూ గట్టిగా హెచ్చరించింది. పార్టీకి ఉపయోగపడేలా పనిచేయాలని, అప్రాసంగిక వ్యాఖ్యలు చేయవద్దని కఠినంగా స్పందించింది.

ఈ కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ చర్చ మరింత మసాలా దిశగా మలుపు తిరిగింది. లడ్డు వివాదం చుట్టూ మళ్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం జరిగిన విషయాన్ని నివేదికలతో స్పష్టం చేస్తుండగా, మరోవైపు ప్రతిపక్షం విమర్శలతో దాడి చేస్తోంది. కానీ తాజా పరిణామంలో జనసేన ఇచ్చిన రిప్లయ్ రాజకీయ వేదికపై గట్టి సందేశం ఇచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు.

సోషల్ మీడియా యుద్ధాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధాన ఆయుధంగా మారాయి. ఒక కామెంట్‌కు మరో కౌంటర్ వెంటనే వస్తోంది. తాజా ఘటనలో జనసేన ఇచ్చిన దిమ్మదిరిగే సమాధానం రాజకీయ చర్చను కొత్త దిశలోకి నెట్టింది.

సినిమా

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది....

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 13 సంవత్సరాల లోపు బాలలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

పులివెందులకు గుడ్ బై.? ‘మావిగన్’ నుంచి పోటీ చేయనున్న జగన్.?

రాయలసీమపై వైఎస్సార్సీపీ ఆశలు వదిలేసుకుందా.? పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయడంలేదా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘మావిగన్’ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా.? ‘మావిగన్’...

మూడు రోజుల వర్ష హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాలకు పిడుగు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నేడు, రేపు మరియు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో...

Tollywood: తెలుగు సినిమా మారాల్సిన టైమ్ ఇదే..!

Tollywood: తెలుగు సినిమా గత దశాబ్దంలో ఊహించని స్థాయిలో ఎదిగింది. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే ఎక్కువగా హిందీ సినిమానే గుర్తొచ్చేది. దక్షిణాదిలోనూ తమిళ సినిమా ఆధిపత్యం ఎక్కువగా కనిపించేది. కానీ 2015లో...