సాధక్‌ల శ్రమతోనే జనసేనకు దేశవ్యాప్త గుర్తింపు: నాదెండ్ల మనోహర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,313FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ బలోపేతం, విస్తరణలో సాధక్‌లు అత్యంత కీలక పాత్ర పోషించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సాధక్‌లు రాత్రింబవళ్లు శ్రమించి పార్టీని ప్రజల్లో బలంగా నిలబెట్టారని ఆయన కొనియాడారు. రాజమండ్రిలో నిర్వహించిన సాధక్‌ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.

గత 12 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా పార్టీని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసైనికులు, వీరమహిళల సంక్షేమం కోసం ఆయన ఎప్పుడూ అండగా నిలుస్తారని తెలిపారు. ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం వెనుక సాధక్‌లు, కార్యకర్తల కష్టమే ప్రధాన కారణమని చెప్పారు.

జనసేన కార్యకర్తలు ఇతర పార్టీలతో పోలిస్తే ఎక్కువ అంకితభావంతో పనిచేస్తారని, ప్రజా సేవనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతారని పేర్కొన్నారు. అందుకే పార్టీకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి పరామర్శించే స్థాయికి జనసేన నాయకత్వం ఎదగడం పార్టీకి దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ స్థాయి గుర్తింపు వెనుక పవన్ కళ్యాణ్ పట్టుదల, నిరంతర కృషి ఉందన్నారు.

పార్టీ సభ్యత్వాన్ని కేవలం ఇన్సూరెన్స్‌తో ముడిపెట్టవద్దని, అది జనసేన సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రూ.400 సభ్యత్వాల కోసం సాధక్‌లు క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి కృషి అమోఘమని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మినవారే రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేయగలరని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 వేల మంది సాధక్‌లతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి నుంచే ప్రారంభించామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధక్‌లు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. గతంలో అధికారంలోకి వస్తామని కూడా ఊహించని పరిస్థితి నుంచి నేడు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి నామినేటెడ్ పోస్టులు వచ్చే స్థాయికి జనసేన ఎదిగిందని పేర్కొన్నారు. ఇదే ఐక్యత, పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

సినిమా

S. JANAKI: “గుడికే చేరిన దీపం.. పడమటి సంధ్యా రాగం”

 "కొండల్లో... కోనల్లో... కూ యన్న ఓ కోయిల..." ఆ పాటలో వినిపించిన ఆ కోయిల గాత్రం ఇక కొత్త పాటల్లో వినిపించకపోవచ్చు. కానీ ఆ స్వరం మాత్రం...

 శ్రీకాంత్‌తో రిలేషన్‌పై రీతూ క్లారిటీ.. ఎంత సాయం చేశాడంటే?

బిగ్‌బాస్ ఫేమ్ రీతూ చౌదరి గతంలో చీమకుర్తి శ్రీకాంత్‌తో తన రిలేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. తమ ఇద్దరికీ...

‘మీ స్వరం ఎప్పటికీ అమరం’.. జానకికి చిరంజీవి భావోద్వేగ నివాళి

లెజెండరీ గాయని ఎస్. జానకి  మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకి మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందని పేర్కొంటూ,...

S.Janaki: చిత్రసీమలో విషాదం..! దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూత

S.Janaki: ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఇటివల అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె...

‘అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం’.. ‘ఓ.! సుకుమారి’పై నిర్మాత...

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన గ్రామీణ కుటుంబ కథా చిత్రం 'ఓ.! సుకుమారి' జూలై 17న ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల భద్రతపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్...

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

వియత్నాం బోటు ప్రమాదం.. వెంటనే రంగంలోకి దిగిన లోకేష్!

వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారన్న సమాచారం అందడంతో అత్యవసరంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిపై పూర్తి...

“కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడతారు”.. తాళ్లూరి రామ్

జనసేన పార్టీ కార్మికులు, శ్రామికులు, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ అన్నారు. జనసేన సభ్యత్వం పొందిన కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం...

సౌత్ కొరియాలో లోకేష్ సక్సెస్ టూర్.. 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వారంరోజుల సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత్-దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే...

ఎక్కువ చదివినవి

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి వంటి అంశాలపై అసత్య ప్రచారం చేస్తూ...

కియాకు లోకేష్ ఆహ్వానం.. ఏపీలో ఈవీ హబ్ ఏర్పాటు చేయండి

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో సియోల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో...

E20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు.. అసలు వివాదమేంటి?

భారత్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్‌తో కూడిన ఈ20 (E20) ఇంధనాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి ముందుగానే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ నిర్ణయంపై పలు ప్రాంతాల్లో వ్యతిరేకత...

Daily Horoscope: మకరం వారికి ఉద్యోగ పురోగతి.. మీనం వారికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త

జులై 6 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈ రోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్యకు ఉపయోగపడే సూచనలను అందిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు...

ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగినా.. జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదా?

కాకినాడ జిల్లా తునికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి నెల రోజులు పూర్తయ్యాయి. గత నెల 6వ తేదీన ఇంటి సమీపంలో తండ్రి కోసం వెతుకుతూ వెళ్లిన చిన్నారి అప్పటి...