Switch to English

‘జమిలి’ కూడా ‘డిమోనిటైజేషన్‌’ లాంటిదే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,844FansLike
57,764FollowersFollow

పెద్ద నోట్ల రద్దుతో (డిమోనిటైజేషన్‌) దేశంలో సరికొత్త మార్పు వస్తుందని అంతా ఊహించారు. తాను చెప్పిన మార్పు వచ్చి తీరుతుందంటూ ఆ నిర్ణయం తీసుకునే ముందు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటల్ని ఎవరూ మర్చిపోలేరు. తీవ్రవాదం అంతమైపోతుందన్నారు, దేశంలో అవినీతికి ఆస్కారమే వుండదన్నారు. నకిలీ కరెన్సీకి అవకాశం వుండదనీ, నల్లధనం జాడే కన్పించదనీ ప్రధాని నరేంద్ర మోడీ డిమానిటైజేషన్‌ గురించి ప్రకటిస్తూ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ, ఏం జరిగింది? ఇప్పటికీ దేశంలో పైన చెప్పిన ‘చెడు’ అంశాలన్నీ సజీవంగానే వున్నాయి.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నికలు జరిగినన్నాళ్ళూ చాలా చోట్ల 2 వేల రూపాయల నోటు సామాన్యుడికి అందలేదు అధికారికంగా. అనధికారికంగా మాత్రం.. అంటే, ఓట్లను కొనేందుకు ఆ నోటు బాగా ఉపయోగపడింది. ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు జమిలి ఎన్నికల గురించిన చర్చ జరుగుతోంది. దేశాన్ని అభివృద్థి పథం వైపు నడిపించేందుకు ఇదో ప్రయోగమని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. ఈ మేరకు కేంద్రం, పార్లమెంటులో ప్రాతినిథ్యం వున్న పార్టీలతో సమావేశం నిర్వహించింది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడమే ఈ జమిలి కథ. కానీ, మన దేశంలో అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమవుతుంది.. కానీ, అది ఒక్కసారికి మాత్రమే. ఆ తర్వాత చాలా తేలిగ్గా ఆ జమిలి కాస్తా కంగాలీగా మారిపోతుంది.

లోక్‌సభ ఓ టెర్మ్‌ పదవీ కాలం ఐదేళ్ళు. అసెంబ్లీ కూడా అంతే. కానీ, అర్థాంతరంగా ప్రభుత్వం కుప్ప కూలిపోతే? ఆకస్మిక ఎన్నికలు తప్పవు. ఓ రాష్ట్రంలో ప్రభుత్వం కుప్ప కూలిపోతే, దేశమంతా మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా.? దేశంలో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగాల్సి వుంటుందా.? అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. అతి ముఖ్యమైన ఈ విషయాల మీదనే ఎలాంటి ‘గ్రౌండ్‌ వర్క్‌’ చేయకుండా, జమిలి ఎన్నికల గురించిన చర్చ.. అంటే అందులో అర్థమేముంటుంది.? జమిలి ఎన్నికలు మంచిదే.. కానీ, అందులో చాలా ఇబ్బందులున్నాయి. ఇబ్బందులంటే అలాంటిలాంటివి కావు. డిమానిటైజేషన్‌లా నరేంద్ర మోడీ సర్కార్‌ జమిలి ఎన్నికల విషయంలోనూ మొండి వైఖరి ప్రదర్శిస్తే.. అంతే సంగతులు.

9 COMMENTS

సినిమా

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 19 మార్చి 2025

పంచాంగం తేదీ 19-03-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ పంచమి రా. 8.58 వరకు...

Chiranjeevi: అలుపెరుగని చిరంజీవి కీర్తి.. అదొక ప్రవాహం

Chiranjeevi: ఎంత చెప్పుకున్నా.. ఎంతెంత చదివినా.. మరెంత తెలుసుకున్నా.. చిరంజీవి జీవితం నిత్యనూతనం. సినీ ప్రస్థానం, సమాజ సేవలో సాధించిన విజయాలు, సంపాదించిన కీర్తి, అందుకున్న పురస్కారాలు ఇందుకు నిదర్శనం. జీవిత సాఫల్య...

టీడీపీ, జనసేన.. ఆల్ ఈజ్ వెల్.! కండిషన్స్ అప్లయ్.!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో,...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా పలు భారీ చిత్రాలను నిర్మించారు. పెద్ద,...

జనసేన జయకేతనం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు..!

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభ విజయవంతం చేసినందుకు జనసేన అధినేత పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు...