Switch to English

జగన్ రాజకీయ పతనమే.. షర్మిల పంతమా!?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow

చెల్లెలు కట్టుకున్న చీర రంగు మీద కూడా నీఛాతి నీచమైన కామెంట్లు చేసే అన్నయ్య ఎవరైనా, ఎక్కడైనా వుంటారా.? ఎందుకు వుండరు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో వున్నారు కదా.!

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో వుండటం కొత్తేమీ కాదు. రక్త సంబంధాల కంటే, రాజకీయ సంబంధాలు ముఖ్యమనుకునేవారిని కూడా తప్పు పట్టలేం. రాజకీయం అలాంటిది.

కానీ, ఓ మహిళ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసేముందు, ఆమె తన రక్త సంబంధీకురాలు, తోడబుట్టిన చెల్లెలు.. అని కూడా ఆలోచించకపోతే ఎలా.? ఇదే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఆగ్రహావేశాలతో ఊగిపోవడానికి కారణమయ్యింది.

ఒక్క మాటలో చెప్పాలంటే, రాజకీయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పతనాన్ని కోరుకుంటున్నారు వైఎస్ షర్మిల. నిజానికి, అందులో కొంత భాగాన్ని ఆమె చూసేశారు కూడా. పూర్తిస్థాయిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పతనాన్ని ఆమె ఇంకా ఇంకా బలంగా కోరుకుంటున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇద్దరి మధ్యా ఆస్తుల పంపకాల గొడవలున్నాయి. ఆపై రాజకీయ పరమైన విభేదాలూ వున్నాయి. అవి తారా స్థాయికి చేరుకుంటున్నాయి.

వైసీపీకి రాజీనామా చేశాక విజయ సాయి రెడ్డి, వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారట. వైసీపీకి రాజీనామా చేసినా, జగన్ మనిషిగానే విజయ సాయి రెడ్డి, వైఎస్ షర్మిల దగ్గరకు వెళ్ళి ‘రాజీ వ్యవహారాలు’ నడిపారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

కానీ, షర్మిల మాత్రం, తన వద్దకు విజయ సాయి రెడ్డి వచ్చి చెప్పిన మాటల్ని మీడియా ముందు తాజాగా పేర్కొనడాన్ని బట్టి చూస్తోంటే, విషయం వేరే ఏదో వుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

ఆస్తుల పంపకాల వ్యవహారాలకు సంబంధించి తన తల్లి మీద కూడా జగన్ ఆరోపణలు చేయడం, వైసీపీ నాయకులతో తమని తిట్టించడం.. అత్యంత బాధాకరమైన విషయాలనీ, విజయ సాయి రెడ్డితో కూడా తమపై ఆరోపణలు చేయించారనీ, ఈ విషయమై విజయ సాయి రెడ్డి తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని షర్మిల చెబుతున్నారు.

విధిలేని పరిస్థితుల్లోనే జగన్ చెప్పినట్లు విజయ సాయి రెడ్డి వినాల్సి వచ్చిందన్న వైఎస్ షర్మిల, ఇంకా హద్దులు దాటి విమర్శలు చేయలేక, విజయ సాయి రెడ్డి వైసీపీని వీడారన్న అర్థం వచ్చేలా మాట్లాడారు.

ప్రస్తుతానికైతే విజయ సాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లే. ఆయన వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, రాజకీయం అంత తేలిగ్గా వదిలే ‘రోగం’ కాదంటారు.. రాజకీయాల్లో తలపండినవాళ్ళు.

విజయ సాయి రెడ్డి ముందు ముందు వైఎస్ షర్మిలతో కలిసి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేస్తారా.? అదే జరిగితే, ఆయన్ని అక్రమాస్తుల కేసులో ‘అప్రూవర్’గా చూడబోతున్నామా.? విలువలు విశ్వసనీయత.. అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని విజయ సాయి రెడ్డి సీరియస్‌గా తీసుకునే అవకాశమెంత.?

రానున్న రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఒక్కటి మాత్రం నిజం.. జగన్ పతనానికి సంబంధించి ఏ ఒక్క అవకాశాన్నీ షర్మిల వదులుకునేలా కనిపించడంలేదు. జగన్ పతనమే తన పంతం.. అని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లున్నారు.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఆ కీలక ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పనున్నారా.?

‘మేం శాసన మండలిలో ప్రభుత్వంతో పోరాడుతోంటే, కనీసం శాసన సభ్యుడిగా మీరు శాసన సభకి హాజరై, వైసీపీ వాయిస్‌ని బలంగా వినిపించకపోతే ఎలా.?’ వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు, తమ అధినేత వైఎస్...

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి వాయిదా వేశారు. మొదట మార్చి 28వ...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌ పోస్టర్ బ్యానర్‌లో నాని సమర్పణలో రాబోతున్న...

మెగాస్టార్ జోడిగా ఎవరికి ఛాన్స్..?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో...

జయకేతనం.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై జనసేనాని సంతకం.!

రాజకీయ పార్టీలకు కార్యకర్తలుంటారు.! కానీ, జనసేన పార్టీకి సైనికులున్నారు.! ‘వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఓటు హక్కు కూడా లేని పిల్లలు..’ అంటూ జనసేన పార్టీ మీద ఒకప్పుడు వినిపించిన రాజకీయ విమర్శలు...