Switch to English

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది. ఈ విషయంలో వైఎస్ జగన్ సర్కారుని అభినందించకుండా వుండలేం. కానీ, ఇక్కడ వైఎస్ జగన్ చేస్తున్నది వ్యాపారం.

ప్రజలు తమ సొమ్ముతో ప్లాట్లను కొనుగోలు చేస్తోంటే, దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు పెట్టడమేంటి.? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంటుంది. ప్రైవేటు టౌన్ షిప్స్ ఎలాగైతే, తమ సంస్థల పేర్లను ఆయా వెంచర్లకు పెడుతుంటాయో.. ఇక్కడ, ప్రభుత్వం కూడా అలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు పెడుతోందన్నమాట.

ఇంతకీ, ప్రభుత్వ లే ఔట్లలో భూములు కొనే ప్రజలకు అదనపు ప్రయోజనాలు ఏముంటాయట.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. మార్కెట్ రేటు కంటే తక్కువకు ప్రభుత్వం భూములు అమ్మే పరిస్థితి వుండదు. అలా చేస్తే, ఖజానాకి నష్టం కలుగుతుంది. అంటే, మళ్ళీ ఆ భారం ప్రజల మీదనే పడుతుంది.

ఇక, లే ఔట్లలో అభివృద్ధి.. అంటే, దానికి మళ్ళీ ప్లాట్ల యజమానుల నుంచే ఏదో ఒక రూపంలో వసూళ్ళు తప్పవు. ఎలా చూసినా, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్.. అంటే, ఇదొక ‘యాపారం’ తప్ప, ఇందులో ప్రజా ప్రయోజనమేదీ ఇసుమంత కూడా వుండదన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

ఎవరి గోల వారిది. జగనన్న గోరు ముద్ద.. జగనన్న కాలనీలు.. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్.. ఎలా ఎటు చూసినా, అంతా జగన్మాయ.. ఇంకెందుకు, ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చేసి.. జగనన్న ప్రదేశ్.. అని పెట్టేస్తే పోలా.? అంటూ సోషల్ మీడియా వేదికగా మీమ్స్ పడుతున్నాయి. ఏమో, ఆ ముచ్చట కూడా ముందు ముందు చూడబోతామేమో.!

రెండున్నరేళ్ళయ్యింది.. ఆంధ్రప్రదేశ్ రాధాని విషయమై గందరగోళానికి తెరలేచి. ఇప్పటిదాకా రాజధాని పేరుతో కొత్తగా ఒక్క ఇటుక అటు విశాఖలోగానీ, ఇటు కర్నూలులోగానీ.. ఏకైక రాజధాని అమరావతిలోగానీ పడింది లేదు. మరెలా, ప్రభుత్వం వెంచర్లు వేసేసి.. ప్రజలకోసం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లను నిర్మించేస్తుంది.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అయ్యింది.. దాన్ని వైఎస్ జగన్ సర్కారు ఆపేసింది. మరి, వైఎస్ జగన్ హయాంలో ప్రకటితమవుతున్న జగనన్న కాలనీలు, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లు తర్వాత వచ్చే ప్రభుత్వ హయాంలో కొనసాగుతాయని ఎలా అనుకొగలం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...