జగన్ మిగతా విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ పాలన విషయంలో కొంత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మెచ్చుకోదగిన పాలన చేస్తున్నారు. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం జగన్ తీసుకునే నిర్ణయాలు కొంత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నవరత్నాలను నెరవేర్చాలి అంటే చాలా డబ్బు కావాలి. వీటితో పాటుగా మరికొన్ని ఉచిత పధకాలు ప్రవేశపెట్టడంతో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడుతున్నది.
దీని నుంచి మొదట బయటపడాలి. దానికోసం మోడీ మాదిరిగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, నిర్ణయాలు కఠినంగా ఉంటేనే అభివృద్ధి కనిపిస్తుంది. కానీ, రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రజలకు ఉచిత పధకాలు అమలు చేస్తూ ఉన్న డబ్బును వీటికి ఖర్చు చేస్తున్నారు. ఇక అభివృద్ధి, మార్పు రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది.
రాష్ట్రంలో విద్యావంతులు ఉంటేనే మార్పు వస్తుంది. ఎప్పుడైతే అక్షరాస్యత 100శాతం ఉంటుందో అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. ఎవరూ కూడా ఉచిత పధకాల కోసం ఎదురు చూడరు. చదువుకొని దొరికిన ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. ఇలా ఉచితం పక్కన పెట్టాలి అంటే అక్షరాస్యత ఉండాలి.
రాష్ట్రంలో కేవలం 33శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. మొదట ప్రజలు అక్షరాస్యులుగా మారాలి. దీనికోసం చదువుకునే వాళ్లకు ప్రోత్సాహం అందించాలి. అక్షరాస్యతను పెంచేందుకు జగన్ జగనన్న వసతి దీవెన అనే పేరుతో ఓ పధకాన్ని తీసుకొచ్చారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచుతారట.
ఇంటర్ తరువాత అక్షరాస్యత శాతం బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో 50 శాతం ఉంటె ఇండియాలో కేవలం 25 శాతం మాత్రమే ఉన్నది. దీనిని పెంచేందుకు జగన్ నడుం బిగించినట్టు చెప్పుకొచ్చారు. దేశంలో మార్పు రావాలి అంటే మొదట రాష్ట్రంలో రావాలని, ఆంధ్రప్రదేశ్ లో మార్పు తీసుకొస్తానని అంటున్నారు జగన్. చూద్దాం ఎంతవరకు సాధ్యం అవుతుందో.