Switch to English

మహిళలే జ‘గన్’ టార్గెట్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఏపీలో ఓవైపు కరోనా కేసుల కల్లోలం కొనసాగుతున్నప్పటికీ, పాలనాపరమైన అంశాల్లో సీఎం జగన్ దూకుడుగానే వెళుతున్నారు. కేవలం కరోనాపై సమీక్షలకే పరిమితం కాకుండా ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నారు. మహిళలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం ఆగిపోయిన ఓ పథకాన్ని మళ్లీ జీవం పోశారు. పొదుపు సంఘాల మహిళలకు జీరో వడ్డీ పథకాన్ని తాజాగా ప్రారంభించారు. తద్వారా దాదాపు 91 లక్షల మంది మహిళలకు రూ.1400 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తున్నారు.

ఇప్పటికే ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన నిధులను నేరుగా తల్లి ఖాతాలో వేయాలని నిర్ణయం తీసుకున్న జగన్.. మరోసారి మహిళలే టార్గెట్ గా ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఏ ప్రభుత్వమైనా మహిళలను ఆకట్టుకుంటే వారికి తిరుగు ఉండదు. అందుకే ప్రతి నేతా అతివలను మంచి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మొన్నటి ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు-కుంకుమ పేరుతో మహిళల ఖాతాల్లో డబ్బులు వేసిన ప్రయత్నమూ అలాంటిదే. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏమీ చేయని చంద్రబాబు.. అకస్మాత్తుగా ఎన్నికల ముందు చేసిన జిమ్మిక్కులు మహిళలు, వృద్ధులకు అర్థం కావడంతోనే అర్ధరాత్రి వరకు చాంతాడంత క్యూలో నిలబడి మరీ ఆయన్ను గద్దె దించారు.

మరోవైపు జగన్ కూడా ఎన్నికల సందర్భంగా మహిళలకు పలు హామీలిచ్చారు. అయితే, చంద్రబాబు చేసిన తప్పు చేయకుండా తన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే జగనన్న అమ్మఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు జనవరిలో రూ.15వేల సాయం అందించారు. అలాగే జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన వంటి పథకాలతో మరో 24 లక్షల మంది తల్లులు లబ్ధి పొందారు. అలాగే నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చారు.

తద్వారా ఏ పని చేసినా.. మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారి మెప్పు పొందాలని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.94 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో దాదాపు రెండు కోట్ల మంది మహిళలే. ఇప్పటికే పలు పథకాల ద్వారా 75శాతం మంది మహిళలకు లబ్ది కలిగింది. రాబోయే కాలంలో కూడా అతివలకు ఇదే విధంగా పెద్దపీట వేయడం ద్వారా వారి మదిలో నిలిచిపోవాలన్నది జగన్ భావనగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...