Switch to English

జగన్‌ సారూ.. ‘కోటి’ సరే, ఈ శతకోటి ప్రశ్నల సంగతేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఎపిసోడ్‌కి సంబంధించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఇది నిజంగానే స్వాగతించాల్సిన విషయం. అయితే, ఇంతటి దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థపై ముఖ్యమంత్రి ఎందుకు తీవ్రంగా స్పందించలేకపోయారు.? ‘ఎల్జీ పాలిమర్స్‌ అనేది మల్టీ నేషనల్‌ కంపెనీ. చాలా బాగా పనిచేసే కంపెనీ. అలారం ఎందుకు మోగలేదు? అన్నది నాకూ అనిపిస్తోంది..’ అంటూ చాలా సున్నితంగానే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

లాక్‌డౌన్‌ అమల్లో వున్నా, ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించే ఫ్యాక్టరీల్లో మెయిన్‌టెనెన్స్‌ తప్పనిసరి. అలాంటప్పుడు, లాక్‌డౌన్‌ నేపథ్యంలోనే ‘రసాయనం’ నిల్వ వుండిపోవడం, వేడికి అది లీక్‌ అవడం జరిగిందంటూ యాజమాన్యం ప్రకటించడమేంటి.? ఇక్కడ యాజమాన్యం తప్పిదం సుస్పష్టం. దాన్ని ప్రభుత్వం ఎందుకు ‘కవర్‌’ చేయాలని చూస్తోందన్నదే ఎవరికీ అర్థం కావడంలేదు. ఇదిలా వుంటే, ‘కోటి’ ఎక్స్‌గ్రేషియాపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి, ఆ కోటి రూపాయల మొత్తాన్నీ కంపెనీ నుంచే వసూలు చేయాలి. ఆ మాటకొస్తే, ప్రమాదకర రసాయనాలతో పరిశ్రమలు నడిపే సంస్థలు, ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగితే.. భారీ స్థాయిలో ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సి వస్తుంది. ఇందుకోసం పెద్దయెత్తున ఇన్స్యూరెన్స్‌ సౌకర్యాన్నీ కలిగి వుంటారు. ఒక్కో మరణానికీ 5 కోట్ల వరకూ ఎక్స్‌గ్రేషియా ఇచ్చే స్థాయిలో ఇన్స్యూరెన్స్‌ వుంటుందని నిపుణులు చెబుతుండడం గమనార్హం.

మరోపక్క, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రభుత్వాలు సదరు కంపెనీల నుంచి భారీ స్థాయిలో నష్ట పరిహారాల్ని వసూలు చేయాల్సి వుంటుంది. కానీ, ఈ అంశాలపై ముఖ్యమంత్రి ఇప్పటిదాకా స్పందించకపోవడం ఆశ్చర్యకరమే. అత్యవసరం కాకపోయినా, ఎల్జీ పాలిమర్స్‌కి స్థానిక యంత్రాంగం లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చిందా.? గత కొంతకాలంగా ఈ సంస్థపై ఫిర్యాదులు చేస్తున్నామని స్థానికులు చెబుతున్న మాట నిజమైతే, అధికారులు ఎందుకు స్పందించలేదు.? ఇలా చాలా ప్రశ్నలు దాగి వున్నాయి.

వాటికి సమాధానం చెప్పలేకనే, భారీ స్థాయిలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందనే విమర్శలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. ఇంతటి దుర్ఘటనను మించిన దారుణం ఏంటంటే, అధికార పార్టీ.. ఈ ఘటనతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తుండడం. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే వస్తుంది.. ఇంతటి పబ్లిసిటీ.. అన్నట్లు అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. శవ రాజకీయాలకు పరాకాష్ట ఇది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...