జగన్ బాబు నుంచి చంద్రబాబుకు బలమైన ప్రశ్నలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,096FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆస్తులను దోచుకుంటూ, అవినీతి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పి, అధికారంలోకి వచ్చాక మాత్రం మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేయడం  పెద్ద అన్యాయం అన్నారు. 2019కి ముందు మీరు మూడు సార్లు సీఎంగా ఉన్నా ఒక్క మెడికల్‌ కాలేజీ పెట్టలేదని గుర్తు చేశారు. కానీ తాను 5 ఏళ్లలోనే 17 కొత్త కాలేజీలు ప్రారంభించామని, వాటిలో 5 ఇప్పటికే క్లాసులు మొదలై, 800 కొత్త ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. మిగిలిన కాలేజీలను ముందుకు తీసుకెళ్లకుండా ప్రైవేట్‌ వారికి అప్పగించడం అవినీతికి నిదర్శనమని జగన్ మండిపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సీట్లు 2,360 నుంచి 4,910కి పెరగాల్సిందని, దీని వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు చవకగా వైద్య విద్య లభించేదని తెలిపారు. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల  తమ పిల్లలను డాక్టర్లుగా చేయాలనుకునే తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి విదేశాలకు పంపుతున్న స్థితి వస్తోందని, ఇలాంటి సమయంలో పులివెందుల కాలేజీకి కూడా సీట్లు వద్దని లేఖ రాయడం కుట్రేనని అన్నారు.

కొత్త  కాలేజీలు ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేస్తాయని, ఉచిత సేవలు ప్రజలకు అందుతాయని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం కమీషన్ల కోసం ప్రజల ఆస్తులను పందేరం పెడుతున్నారని ఆరోపించారు.

ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చంద్రబాబు నాశనం చేశారని, 15 నెలల్లో ఇవ్వాల్సిన రూ.4,500 కోట్లలో రూ.600 కోట్లు మాత్రమే ఆస్పత్రులకు చెల్లించారని, మిగిలిన రూ.4,000 కోట్లను ఎగ్గొట్టారని తెలిపారు. వైద్యం కోసం పేదవాడి భద్రతను దెబ్బతీశారని ఆరోపించారు. అంతేకాకుండా “ఆరోగ్య ఆసరా’’ పథకాన్ని కూడా సమాధి చేశారని జగన్  అన్నారు.

ప్రభుత్వం చేసే  పనిని ప్రైవేట్‌ కంపెనీలకు ఎలా ఇస్తారు? కోవిడ్‌ లాంటి సమయంలో బీమా కంపెనీలు వెనక్కి తగ్గినా, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ఉచిత చికిత్స అందించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉండదని, ప్రీమియం పేరుతో తమవాళ్ల కంపెనీలకు లాభాలు చేకూర్చడమే చంద్రబాబు లక్ష్యమని జగన్ అన్నారు.

ప్రజలు చంద్రబాబును క్షమించరని, తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేసి, మెడికల్‌ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తీసుకువస్తామని జగన్  ప్రకటించారు.

సినిమా

రష్మిక ‘కాక్టెయిల్ 2’ అప్‌డేట్: సిసిలీలో ఫుల్ జోష్ షూట్!

నటి Rashmika Mandanna తన కొత్త సినిమా కాక్టెయిల్ 2 గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన పాత్ర ‘దియా’ డైరీ నుంచి ఒక భాగాన్ని...

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన...

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే...

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

రాజకీయం

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

ఎక్కువ చదివినవి

“హిట్స్ ఉంటేనే డిమాండ్.. శ్రీలీలకు ప్రస్తుతం చిన్న బ్రేక్?”

టాలీవుడ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఫలితాల మీదే ఆధారపడే ప్రపంచం. ముఖ్యంగా హీరోయిన్లకు హిట్స్ ఉంటేనే డిమాండ్ పెరుగుతుంది. అందం, అభినయం, డాన్స్—అన్నీ కలగలిపిన ప్రతిభతో Sreeleela తక్కువ సమయంలోనే టాప్ చాయిస్...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఫస్ట్...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

వివాహం పేరుతో వల… 67 మంది యువతులను మోసం చేసిన నకిలీ అధికారి అరెస్ట్

శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారిగా వేషధారణలో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. నిందితుడు బాలకృష్ణగా గుర్తించిన పోలీసులు, అతడు చేసిన మోసాల వివరాలు వెలుగులోకి రావడంతో షాక్‌కు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్...