Switch to English

జగన్ ప్రెస్ మీట్.! ఇచ్చట గాడిదలు కాయబడును.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,201FansLike
57,764FollowersFollow

‘..క్కలో వేసెయ్యాలి’.. అంటూ, ప్రెస్ మీట్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోరు జారారు.! అంతే కాదు, చీటింగ్ కేసు కూడా పెట్టాలట చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీద. ఎందుకంటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదట కూటమి ప్రభుత్వం.

రాజకీయాలన్నాక విమర్శలు సహజమే. ప్రతిపక్ష నేత హోదా ఆశిస్తున్న వైఎస్ జగన్, తన రాజకీయ ప్రత్యర్థుల మీద రాజకీయ విమర్శలు చేయడంలో వింతేముంది.? కాకపోతే, విమర్శల స్థాయి హద్దులు దాటితేనే, అసలు సమస్య. ‘..క్కలో వేయాలి’ అని ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గురించీ, మంత్రి గురించీ, ఉప ముఖ్య మంత్రి గురించీ నోటికొచ్చినట్లు మాట్లాడటం క్షమార్హం కాదు.

‘గాడిదలు కాస్తున్నారా.?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా వైఎస్ జగన్ మాట తూలారు. ఇవన్నీ వైరల్ కంటెంట్.. అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్క్రిప్టు రాసిచ్చేటప్పుడు, సజ్జల రామకృష్ణా రెడ్డి, అండర్ లైన్ చేసి వుంటారేమో.! అందుకే, వీటిని స్పెషల్‌గా మెన్షన్ చేశారు వైఎస్ జగన్.

2019 నుంచి 2024 మధ్య ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ జగన్, అధికారిక బహిరంగ సభల్లోనూ అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు. ఆ ఫలితమే, వైసీపీ 11 సీట్లకు పరిమితమైపోయేలా చేసింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా పోయాక కూడా, అదే తీరులో మాట జారితే, ప్రజలు క్షమించే పరిస్థితి వుంటుందా.? ఛాన్సే లేదు.

వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికార పీఠమెక్కాలనుకుంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నిజంగానే ఆయన అలా కోరుకుంటోంటే, బెంగళూరు వదిలేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే వుండాలి. అన్నిటికీ మించి, నోటి శుద్ధి అనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా చాలా ముఖ్యం.

ముందే చెప్పుకున్నట్లు రాజకీయాలన్నాక విమర్శలు తప్పవు. కానీ, విమర్శలు చేసేటప్పుడు స్థాయిని దిగజార్చేసుకోకూడదు ఏ రాజకీయ నాయకుడైనా సరే.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే జైల్లో పెట్టాల్సి వస్తే, మద్య నిషేధం అమలు చేయనందుకు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా జైల్లో వెయ్యాల్సి వస్తుంది కదా.?

‘..క్కలో’ అని వైఎస్ జగన్ భాషలో చెప్పడానికి బహుశా కూటమి నేతలు కొంచెం ఆలోచిస్తున్నారేమోగానీ, లేదంటే.. అంతకన్నా గట్టిగా సమాధానం టీడీపీ నుంచి అలానే జన సేన నుంచీ వైసీపీ అధినేత మీదకు వచ్చి వుండేదే.! వస్తుందేమో కూడా.!

వారానికోసారి బెంగళూరు నుంచి రావడం, అదోరకమైన ప్రెస్ మీట్ లాంటిది పెట్టడం, ఆ వెంటనే తిరుగు ప్రయాణంలో బెంగళూరుకి వెళ్ళిపోవడం.. ఇదంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి వారం ఓ ప్రసహనంలా మారిపోయింది.

సినిమా

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

రాజకీయం

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

ఎక్కువ చదివినవి

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్ బాబు పేరును స్మరించుకుంటూ ఆయన అభిమానులు...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’

సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.190...