అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,626FansLike
57,764FollowersFollow

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు. ప్రజా క్షేత్రంలో ప్రజా వ్యతిరేకులుగా మిగిిలపోతారు.

అదేంటో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి కూడా, రాష్ట్ర రాజధాని అమరావతికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకంగా నినదిస్తూ వుంటారు. అధికారంలో వున్నప్పుడూ అదే తంతు, అధికారం కోల్పోయాక కూడా అదే తంతు. వైసీపీ, 151 నుంచి 11 సీట్లకు పడిపోవడానికి వున్న చాలా కారణాల్లో, అమరావతిపై వైసీపీ వ్యవహరించిన  వైఖరి కూడా ఒక ముఖ్యమైన కారణం.

అయ్యిందేదో అయిపోయింది, ఇకపై రాజధాని విషయంలో వైసీపీ నిర్ణయం మారుతుంది. అమరావతికే వైసీపీ కట్టుబడి వుంటుంది.. అని బొత్స సత్యనారాయణ లాంటి వైసీపీ కీలక నేతలు, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వ్యాఖ్యానించారు. కానీ, వైఎస్ జగన్ మాత్రం తన వైఖరి మార్చుకోలేదు.

రాజధాని అమరావతి రివర్ బేసిన్‌లో వుందనీ, రివర్ బేసిన్‌లో సాధారణ ఇళ్ళు కట్టుకోవడానికి కూడా అనుమతి వుండదని సుప్రీంకోర్టు చెబుతుందని తాజాగా వైఎస్ జగన్, సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంతటి ద్వేషం వుందన్నది ఈ వ్యాఖ్యలతో నిరూపితమైపోయింది.

దేశంలో చాలా ప్రముఖ నగరాలు నదీ తీరానే వర్ధిల్లుతున్నాయి. అమరావతి కూడా, కృష్ణా నది పక్కనే నిర్మితమవుతోంది. ఇందులో వింతేముంది.? ప్రపంచంలో చాలా దేశాలు కూడా, నదీ పరీవాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయి. గొప్ప నగరాలుగా మారాయి.

ఏదిఏమైనా, కూటమి ప్రభుత్వానికి అమరావతి విషయంలో ఆయుధాన్ని అందించారు వైఎస్ జగన్. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ, సమీప భవిష్యత్తులో పుంజుకునే ప్రసక్తే లేకుండా పోయిందిప్పుడు.
‘అబ్బే, జగన్ ఉద్దేశ్యం అది కాదు’ అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి కవరింగ్ డైలాగులు పేల్చుతూ వీడియో విడుదల చేసినా, అప్పటికే డ్యామేజ్ అంచనాలకు మించి జరిగిపోయింది.

సినిమా

NBK111: బాలకృష్ణ-గోపీచంద్ సినిమాలో మరో క్రేజీ హీరో..! కీలక అప్డేట్ ఇచ్చిన...

NBK111: నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #NBK111 గా తెరకెక్కుతున్న సినిమా చారిత్రక నేపథ్యంలో...

రమణి కళ్యాణం ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్.. ఫీల్‌గుడ్ ప్రేమకథపై పెరిగిన ఆసక్తి

ఈ మధ్యకాలంలో భారీ యాక్షన్‌, మాస్ హంగామా కంటే హృదయానికి దగ్గరయ్యే క్లీన్ ఎమోషనల్ కథల వైపు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి...

Jr.Ntr: ‘వాళ్ల ఆశలు నెరవేరేదెప్పుడో మరి..’ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

Jr.Ntr: ప్రతి ఏటా తమ అభిమాన హీరో పుట్టినరోజు అభిమానులకు పండగ. తమ హీరో కొత్త సినిమా కబురు కోసం వెయిట్ చేస్తారు. హీరోకు శుభాకాంక్షలు...

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్, ఐ ఫీస్ట్.. ‘డ్రాగన్’...

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలను మోసుకుంటూ వచ్చిన ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ వారి ఎదురుచూపులకు తెర దించింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్...

Peddi: రికార్డులతో హోరెత్తిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్.. సెన్సేషనల్ నెంబర్స్ ఇవి..

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది. బుచ్చిబాబు...

రాజకీయం

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: లోకేష్

అమరావతిలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh ప్రభుత్వ విద్యావ్యవస్థలో తీసుకురానున్న కీలక మార్పులపై విస్తృతంగా మాట్లాడారు. “దేశానికే ఆదర్శంగా ఆంధ్ర...

ఆసియా క్రీడలకు ఎంపికైన జ్యోతి సురేఖకు మంత్రి లోకేష్ అభినందనలు

అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశానికి గుర్తింపు తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ Vennam Jyothi Surekha ఈ ఉదయం ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh...

గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. జియో ట్యాగింగ్‌తో రోడ్ల పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమగ్రాభివృద్ధికి పారదర్శక సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు,...

మత్స్యకార ఇంటికి వెళ్ళి గరిటె తిప్పిన చంద్రబాబు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో మంగళవారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఓ మత్స్యకార కుటుంబం ఇంటికి వెళ్లి వారితో కలిసి సాధారణ వ్యక్తిలా...

వంద బోట్లతో సీఎం ఇంటికి మత్స్యకారులు.. లోకేష్ ఆత్మీయ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండో ఏడాది “మత్స్యకారుల సేవలో” నిధులను విడుదల చేయడంతో మత్స్యకారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణానదిపై సుమారు వంద బోట్లలో భారీగా తరలివచ్చిన మత్స్యకారులు సీఎం చంద్రబాబు నాయుడు...

ఎక్కువ చదివినవి

Chiranjeevi-Vijay: సీఎం విజయ్ కు చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ..! వైరల్ అవుతున్న న్యూస్

Chiranjeevi-Vijay: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి.. ఇటివలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ కు మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందనే వార్త ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్...

Jr.Ntr: ‘వాళ్ల ఆశలు నెరవేరేదెప్పుడో మరి..’ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

Jr.Ntr: ప్రతి ఏటా తమ అభిమాన హీరో పుట్టినరోజు అభిమానులకు పండగ. తమ హీరో కొత్త సినిమా కబురు కోసం వెయిట్ చేస్తారు. హీరోకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. నిజానికి ప్రతి హీరో అభిమానుల్లోఈ...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

వివేకా హత్య కేసులో ఏబీ వెంకటేశ్వరరావు వైఫల్యమే టీడీపీ ఓటమికి కారణమైందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలనంగా మారిన Y. S. Vivekananda Reddy హత్య కేసు ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండానే కొనసాగుతోంది. అయితే ఈ కేసును లోతుగా పరిశీలించిన రాజకీయ...

గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. జియో ట్యాగింగ్‌తో రోడ్ల పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమగ్రాభివృద్ధికి పారదర్శక సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు,...