Switch to English

ప్రజలకు ఆస్తినిస్తున్నారా.? ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఓటీఎస్.. అదేనండీ వన్ టైమ్ సెటిల్మెంట్.. ఈ పేరిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘మేం అధికారంలోకి వస్తే, ఓటీఎస్ ఉచితంగానే చేసిస్తాం..’ అంటోంది తెలుగుదేశం పార్టీ. అధికార వైసీపీ మాత్రం, ‘ఓటీఎస్ స్వచ్ఛందం కాదు..’ అని పైకి చెబుతూనే, తెరవెనుకాల కథ వేరేలా నడిపిస్తోంది.

ఓటీఎస్ చేసుకోకపోతే పెన్షన్లు రావంటూ ఇప్పటికే కింది స్థాయిలో నోటీసులు జారీ అయ్యాయి. ‘తూచ్, అదేదో కొందరు అత్యుత్సాహంతో చేసిన పని..’ అని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క, పత్రికల్లో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ, ‘ఓటీఎస్’ మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు.

గత ప్రభుత్వాలు, వివిధ పేర్లతో పేదలకు గృహాల్ని అందించిన పథకాలకు సంబంధించిన వ్యవహారమిది. మీరుంటోన్న ఇంటిని మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసేస్తామని ప్రభుత్వాలు చెప్పడం కొత్త విషయం కాదు. దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా తన పేరుని జోడించి, కొత్త హంగామా షురూ చేశారంతే.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఈ పథకానికి, జనం తమ సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమేంటి.? అన్నది ఓ ప్రశ్న. వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా ప్రభుత్వం రాయితీ ఇస్తోంది.. అంటున్నారు అధికార పార్టీ నేతలు. మొత్తంగా రాయితీ ఇచ్చేసి, ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించొచ్చుగా.? అన్నది లబ్దిదారుల వాదన.

ఎవరి గోల వారిదే. అసలు ఇలాంటి పథకాలు, వాటికి తమ పేర్లు పెట్టుకోవాలనే ఆలోచన అధికారంలో వున్నవారికి ఎలా వస్తాయో ఏమోగానీ, ప్రభుత్వ ఖజానా నింపుకునే యత్నం తప్ప, ఇందులో పాలకుల చిత్తశుద్ధి ఏమీ కనిపించడంలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, మీ ఆస్తి విలువ పెరుగుతుంది. దాన్ని తాకట్టు పెట్టుకుంటే ఎక్కువ డబ్బులొస్తాయి.. మంచి ధరకు అమ్ముకోవచ్చు..’ అని ప్రభుత్వమే చెబుతోంది. ఆస్తుల్ని అమ్మేసుకోమని ప్రభుత్వం సలహాలు ఇవ్వడమేమిటో.? కలికాలమనాలా.? రాజకీయంగా ‘పోయేకాలం’ అనాలా.? అర్థం కాని పరిస్థితి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...