Switch to English

కేసీఆర్‌ – జగన్‌ మధ్యలో బీజేపీ చిచ్చుపెట్టిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

బీజేపీకి దగ్గరవుతున్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఆ విషయం అందరికీ అర్థమవుతోంది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలు అందుకు భిన్నంగా వున్నాయి. రాజకీయ అంశాలు కాదు.. రాష్ట్రాలకు సంబంధించి, రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి.. కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ చాలా క్లియర్‌గా వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి.

‘ఆంధ్రప్రదేశ్‌కి కూడా మీరే ముఖ్యమంత్రి అయితే బావుండేది..’ అంటూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చాలామంది సోషల్‌ మీడియా వేదికగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ని అభినందిస్తుండడం, ఎక్కడో వైఎస్‌ జగన్‌కి ఇబ్బందికరంగా అన్పించినట్టుంది. ఆ తర్వాతే సీన్‌ మారిపోయింది. నిజమే, కేసీఆర్‌.. మీడియా ముందుకొస్తే, కరోనా సహా చాలా విషయాలపై మాట్లాడుతున్నారు.. ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆలోచనలు వేరేలా వుంటున్నాయి. ఆయన ప్రెస్‌మీట్‌ అంటే అదో రికార్డెడ్‌ వ్యవహారమన్న అభిప్రాయం బలపడిపోయింది.

పైగా, జగన్‌ ప్రెస్‌ మీట్‌ అనగానే కామెడీలు ఎక్కువైపోతున్నాయి సోషల్‌ మీడియాలో. ఇవన్నీ ఓ ఎత్తు.. కేంద్రంపై పోరాటం విషయంలో కేసీఆర్‌ ‘యోధుడిలా’ వ్యవహరిస్తోంటే, వైఎస్‌ జగన్‌ మాత్రం సర్దుకుపోతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయొద్దని కేసీఆర్‌ చెబితే, సడలింపులు కావాలని వైఎస్‌ జగన్‌ చెప్పారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ తదితర జోన్ల వ్యవహారంలో వైఎస్‌ జగన్‌ తీరుని, కేసీఆర్‌ పరోక్షంగా తప్పు పట్టిన విషయం విదితమే. ఇక, మద్యం షాపులు తెరవడంపైనా కేసీఆర్‌ – వైఎస్‌ జగన్‌ వ్యవహారశౖలిలో వ్యత్యాసాలు సుస్పష్టం.

ఇప్పుడిక పోతిరెడ్డిపాడు వివాదం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యా చిచ్చు పెట్టింది. ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తోన్న బీజేపీ, లోలోపల పండగ చేసుకుంటోంది. నిజానికి, పోతిరెడ్డిపాడుకి సంబంధించిన వ్యవహారంలో జీవో ఇచ్చేముందు, అధికారుల స్థాయిలో తెలంగాణతో చర్చలు జరిగి వుండాల్సింది. అలా జరగకపోవడాన్ని కేసీఆర్‌ తట్టుకోలేకపోతున్నారు. ‘మానవతా కోణంలో చూడాలి..’ అంటూ ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, పోతిరెడ్డిపాడు వివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి చురకలంటించడంతో వివాదం మరింత ముదిరి పాకాన పడింది.

టీఆర్‌ఎస్‌ నేతలంతా రాత్రికి రాత్రి వైఎస్సార్సీపీకి యాంటీగా మారిపోయారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలానే జగన్‌ కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. ఈ వివాదం మొత్తానికి కారణం బీజేపీయేనన్న భావన వైసీపీ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నా.. అది అధినేత స్థాయికి వెళ్ళడం కష్టం. టీఆర్‌ఎస్‌లో అయితే ఈ విషయమై పూర్తిస్థాయి స్పష్టత వుంది. ఇక, జగన్‌తో కేసీఆర్‌ దోస్తీ తెగిపోయినట్లేనని టీఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. 15 మందితో ఈ లిస్టు ని విడుదల చేయగా.. తమిళనాడులో 14, స్థానాలకు పుదుచ్చేరిలో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...