ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో పేద వారు తిండి లేక అల్లాడి పోతున్నారు. కరోనాతో మరణిస్తున్న వారి సంఖ్యతో సమానంగా త్వరలోనే ఆకలి చావులు కూడా ఉంటాయేమో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మన దేశంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికపరమైన వనరులు అన్ని కూడా మూత పడటంతో చాలా మంది తిండిలేక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారి గురించి జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ స్పందించింది.
సోషల్ మీడియాలో రష్మి మాట్లాడుతూ రోడ్డు మీద జీవనం సాగించే వారి పరిస్థితి తల్చుకుంటే బాధగా ఉంది. వారు తినడానికి కనీసం తిండిలేక అల్లాడి పోతున్నారు. ప్రతి ఒక్కరు ఈ సమయంలో వారికోసం తమవంతు సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది.
ఎన్నో జంతువులు కూడా ఈ సమయంలో ఆహారం కొరతతో ఇబ్బందులు పడుతున్నాయంటూ రష్మి కన్నీరు పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితులను తాను ఎప్పుడు చూడలేదని, ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలంటూ పిలుపునిచ్చింది.
మీరు చేసేది ఒక్క రూపాయ సాయం అయినా కూడా అది ఒకరి కడుపు నింపేందుకు ఉపయోగపడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటూ రష్మి చెప్పుకొచ్చింది. చేస్తున్న సాయం ఎంత అనే విషయాన్ని పక్కన పెట్టి మీరు మీకు తోచిన సాయంను అందించాలంటూ విజ్ఞప్తి చేసింది.
కరోనా విపత్తు నేపథ్యంలో పేదల కోసం సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తెలియజేసింది.
Look at those hungry voiceless souls
In this concrete jungle where will they find food
God bless him and many more who are working tirelessly for the needy https://t.co/EJgDRJyH7H— rashmi gautam (@rashmigautam27) March 30, 2020
621573 292867for yet an additional fantastic informative post, Im a loyal reader to this weblog and I cant stress enough how a lot valuable info Ive learned from reading your content material. I genuinely appreciate all the hard work you put into this wonderful weblog. 658667
169370 867236Woh I love your posts , bookmarked ! My wife and i take concern along along with your last point. 717328