Switch to English

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో విన్నాం.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో వింటున్నాం. అసలు వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి పాలక మండలి ఏంటి.? అన్న వాదన భక్తుల్లో ఎప్పటినుంచో వుంది.

అసలు విషయంలోకి వచ్చేస్తే, మాజీ చీఫ్‌ సెక్రెటరీ ఐవైఆర్‌ కృష్ణారావు, చంద్రబాబు హయాంతో పోల్చితే, ఇప్పుడు టీటీడీ ప్రతిష్ట మరింత దిగజారిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వెంకటేశ్వరస్వామిని భక్తితో కొలిచే భక్తులు.. ఆ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో లభించే లడ్డూని ప్రసాదంగా భావిస్తారనీ, దాన్ని తీసుకొచ్చి మార్కెట్‌లో స్వీట్లు అమ్మినట్లు అమ్మితే ఎలా.? అని ప్రశ్నించారు.

‘నేను సీఎస్‌గా వున్నప్పుడు పాలక మండలి విషయంలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తాను. చంద్రబాబు ప్రభుత్వం అవి పట్టించుకోలేదు. అంతకన్నా దారుణంగా తయారైందిప్పుడు టీటీడీ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఐవైఆర్‌ కృష్ణారావు. టీటీడీ ఆస్తుల్ని అమ్మకానికి పెట్టడం అత్యంత బాధాకరమని ఐవైఆర్‌ అభిప్రాయపడ్డారు.

ఐవైఆర్‌ కృష్ణారావు మాత్రమే కాదు, చాలామంది వెంకటేశ్వరస్వామి ఆస్తుల అమ్మకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా, భక్తులు.. దేవుడికి ఇచ్చిన భూముల్ని అమ్మడమేంటి.? ఆ మాత్రం ఇంగితం పాలకులకు లేకుండా పోయిందంటే దానర్థమేంటి.? ‘టీడీపీ హయాంలోనూ జరిగింది..’ అని వైసీపీ నేతలు చెబితే అది బుకాయింపు మాత్రమే అవుతుంది. టీడీపీని ఓటర్లు ఇంటికి పంపారు.. వైసీపీని కూడా అలాగే ఇంటికి పంపేయాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారా.?

ఇదిలా వుంటే, సోషల్‌ మీడియా వేదికగా చాలా మీమ్స్ దర్శనమిస్తున్నాయి. ‘వెంకన్న జోలికి వెళ్ళినోళ్ళవరూ బాగుపడలేదు.. దయచేసి వెంకటేశ్వరస్వామి భూములతో వ్యాపారం చెయ్యొద్దు..’ అని హెచ్చరిస్తున్నారు కొందరు. సాక్షాత్తూ టీటీడీ పాలక మండలిలో సభ్యుడైన (ప్రత్యేక ఆహ్వానితుడు, రాజ్యసభ సభ్యుడు రాకేష్‌ సిన్హా సైతం వెంకటేశ్వరస్వామికి చెందిన భూముల వేలాన్ని తప్పుపడుతున్నారంటే, పాలక మండలి అలియాస్‌ ధర్మకర్తల మండలి.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ‘పాపానికి’ ఒడిగట్టిందనుకోవాలి.? అని విపక్షాలు నిలదీస్తున్నాయి.

మొత్తమ్మీద, వివాదం ముదిరి పాకాన పడుతున్న దరిమిలా, ఈ నెల 28న జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ సమావేశంలో అయినా, సరైన నిర్ణయం తీసుకుని, టీటీడీ.. భూముల వేలంపై వెనుకడుగు వేస్తుందేమో వేచిచూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...