ఇట్స్ కాంప్లికేటెడ్ ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని వుంది : సిద్ధు జొన్నలగడ్డ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,733FansLike
57,764FollowersFollow

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కృష్ణ అండ్ హిస్ లీల. ఐదేళ్ల క్రితం 2020 కరోనా టైం లో డైరెక్ట్ ఓటీటీ రిలీజైన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయ్యింది. సినిమా టైటిల్ ని ఇట్స్ కాంప్లికేటెడ్ గా మార్చి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను రవికాంత్ పెరెపు డైరెక్ట్ చేయగా దగ్గుబాటి రానా, సంజయ్ రెడ్డి నిర్మించారు. సినిమాలో సిద్ధుతో పాటుగా శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు డైరెక్టర్ రవికాంత్ పెరెపు, హీరో సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత రానా. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రవికాంత్, సిద్ధుతో మరో సినిమా చేయాలనుకోగా ఈ సినిమా రిలీజ్ చేస్తేనే గానీ మరో మూవీ చేయమని చెప్పారు అందుకే ఈ సినిమా ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తున్నామని అన్నారు రానా. ఇది రీ రిలీజ్ కాదు థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్ అని అన్నారు. స్టార్ బాయ్ సిద్ధు మాట్లాడుతూ.. ఈ సినిమాను థియేటర్స్ లో ఆడియన్స్ తో కలిసి చూడాలని నా స్ట్రాంగ్ ఫీలింగ్. 14న రిలీజ్ సరైనదే.. ఈ సినిమా ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ చూడాలని ఉందని అన్నారు.

లాక్ డౌన్ లో సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజైంది. ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నానని డైరెక్టర్ రవికాంత్ పెరెపు అన్నారు. ఇట్స్ కాంప్లికేటెడ్ అనేది ఈ సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్.. అందరు రిలేట్ చేసుకునేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు డైరెక్టర్ రవికాంత్ పెరెపు.

ఈ సినిమాకు ముందు వేరే టైటిల్ అనుకున్నాం.. ఆ టైటిల్ పెట్టనివ్వలేదు. అందుకే ఇట్స్ కాంప్లికేటెడ్ అని దర్శకుడు రవికాంత్ ఫిక్స్ చేశారు. థియేటర్ లో ఈ సినిమాను అందరితో కలిసి చూడటం మంచి ఫీలింగ్ అని.. ఇది రీ రిలీజ్ కాదు.. కానీ ఇది థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్ అని అన్నారు రానా.

తనకు అర్ధమయ్యేవి కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే.. అందులో ఈ సినిమా ఒకటి. చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు కాబట్టే సినిమా నచ్చిందని అన్నారు రానా. అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలు రానా దగ్గరికి తీసుకొస్తారు. వాటిని అర్ధం చేసుకుని రానా ముందుకు తీసుకెళ్తాడు. ఈ సినిమా రానాకి కనెక్ట్ అయింది. ఈ సినిమా ముందే థియేటర్స్ లో రిలీజ్ అయ్యుంటే సిక్స్ టైంస్ ఎక్కువ వచ్చేదని అన్నారు సిద్ధు జొన్నలగడ్డ.

వాలెంటైన్స్ డే ఈ సినిమాకు పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అని రానా అన్నారు. థియేటర్స్ లో ఈ సినిమా చూడాలన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని సిద్ధు అన్నారు. ఇక కథల ఎంపికలో తన స్టైల్ గురించి రానా చెప్పారు. కథ ఎందుకు చెబుతున్నాం అన్నది చూసి.. తర్వాత కథ ఎంత కొత్తగా ఉందన్నది చూస్తానని అన్నారు రానా.

సినిమా

చెన్నైలో ‘పెద్ది’ సందడి.. ప్రెస్‌మీట్ కోసం చేరుకున్న రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. జూన్ 4న ప్రేక్షకుల...

బాలయ్య ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మళ్లీ థియేటర్లలోకి ‘భైరవ ద్వీపం’

తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్‌ల ట్రెండ్ మరోసారి జోరందుకుంది. ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన క్లాసిక్ చిత్రాలు ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో రీమాస్టర్ చేసి మళ్లీ...

Peddi: పైరసీ నుంచి ‘పెద్ది’కి రక్షణ..! మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు...

Peddi: రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాకు పెద్ద ఊరట లభించింది. సినిమా పైరసీకి గురి కాకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘పెద్ది’కి యాంటీ-పైరసీ...

ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు.. ఫిలింనగర్‌లో ఘన నివాళులు

తెలుగు జాతి ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళుల...

“వారణాసి” కోసం హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్.. నెల రోజుల పాటు...

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “వారణాసి”పై మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రపంచ స్థాయి విజువల్స్‌, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందుతున్న...

రాజకీయం

చెత్త నుంచి విద్యుత్.. చంద్రబాబు ఆలోచనకు మళ్లీ ఊపిరి!

ఆంధ్రప్రదేశ్‌లో చెత్త నిర్వహణ, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నేపథ్యంలో, ఈ రంగంలో గత ప్రభుత్వాల...

పుష్కరాల్లో చెత్త నిర్వహణకు నిపుణుల సూచనలు వినియోగిస్తాం: పవన్ కళ్యాణ్

గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చెత్త నిర్వహణ, వ్యర్థాల శుద్ధి, విద్యుత్తు ఉత్పత్తి వంటి అంశాల్లో నిపుణుల...

గండిపేట భూ వ్యవహారంలో .. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు!

తెలంగాణలోని గండిపేట ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూముల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, సర్వే నంబర్ 18 పరిధిలోని ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసులో...

డీఎస్సీపై ఆరోపణలు ఎందుకు ఇప్పుడు?.. అన్ని ఆధారాలతో క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ

మెగా డీఎస్సీ-2025 నిర్వహణపై ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన ఆరోపణలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మీడియా సమావేశం నిర్వహించి, డీఎస్సీ నిర్వహణ ప్రక్రియను మొదటి...

తెలంగాణపై వ్యాఖ్యలు వద్దు.. మహానాడుపై చంద్రబాబు కీలక సూచనలు

తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో పార్టీ జనరల్ సెక్రటరీలు, జోనల్ ఇంచార్జ్‌లు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జరిగిన...

ఎక్కువ చదివినవి

“నా సంపద, సంపాదన అంటే ఉద్యమీలు, సాధక్‌లే”: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని క్రమశిక్షణ కలిగిన సిద్ధాంత సమూహంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జనసేన సమావేశాల్లో కనిపించిన హడావుడి,...

గోదావరి కోసం పవన్ స్పెషల్ ప్లాన్.. నదుల కాలుష్యంపై టాస్క్ ఫోర్స్

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...

చిన్నారి అత్యాచార కేసులో నవ్వులు.. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై విజయ్ సస్పెన్షన్ వేటు

తమిళనాడులో బాలికపై జరిగిన దారుణ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కోయంబత్తూర్ జిల్లాలో పదేళ్ల బాలికను కొందరు దుండగులు అపహరించి అమానుషంగా హింసించిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ...

పంచాయతీల ఆర్థిక బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. గోదావరి కాలుష్య నివారణకు రూ.100 కోట్లు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనపై ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని, గ్రామాల అభివృద్ధికి ఆన్లైన్ పన్నుల విధానం కీలకమవుతుందని ఆయన పేర్కొన్నారు....

కొండాపూర్‌లో ఘనంగా ప్రారంభమైన శుభమ్ గ్రాండ్ బ్యాంకెట్ హాల్.. పాల్గొన్న ప్రేమ్ కుమార్

హైదరాబాద్‌లోని కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ వద్ద నూతనంగా నిర్మించిన “శుభమ్ గ్రాండ్ బ్యాంకెట్ హాల్”తో పాటు “శుభమ్ గ్రాండ్ టేక్ అవే అండ్ కేటరింగ్” ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ...