ఏపీలో టీవీకే పార్టీ పోటీ చేస్తుందా.? టీవీకేతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,672FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నానాటికీ మరింత దిగజారిపోతోంది. గత కొన్నాళ్ళుగా వైసీపీ క్యాడర్ అంతా, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పట్టించుకోవడం మానేసింది. వైఎస్ జగన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న సంగతి తెలిసిందే.

వైసీపీ క్యాడర్, ఏపీ రాజకీయాల్ని వదిలేసి, తమిళనాడులో టీవీకే పార్టీ ప్రచార బాధ్యతల్ని భుజానికెత్తుకుంది. సినీ నటుడు విజయ్ నేత విజయ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన దరిమిలా, ఆ ఘనతను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆపాదించేందుకు వైసీపీ క్యాడర్ పడరాని పాట్లూ పడుతోంది.

జగన్ వల్లనే విజయ్ గెలిచారు.. జగన్ తరహా పాలన అందించడానికే విజయ్ ప్రయత్నిస్తారు.. జగన్‌లానే విజయ్ డ్రెస్ వేసుకున్నారు.. అని వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ఓ పనికిమాలిన నేరేటివ్‌ని బలవంతంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, ఈ ప్రచారం చూసి టీవీకే పార్టీ క్యాడర్ నవ్వుకుంటోంది. అసలు జగన్ ఎవరు? అన్న ప్రశ్న టీవీకే క్యాడర్ నుంచి వ్యక్తమవుతోంది. అది వేరే చర్చ. అసలంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వదిలేసి, విజయ్ వెనకాల వైసీపీ ఎందుకు పడుతోంది.?

ఈ ప్రశ్నకు సమాధానంగా, వచ్చే ఎన్నికల్లో టీవీకే ఏపీలో కూడా పోటీ చేస్తుందనీ, టీవీకే పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందనీ కొందరు వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇది అసలు జరిగే పనేనా.? ప్రస్తుతం టీవీకే విజయ్, కాంగ్రెస్ పార్టీ సాయంతో ముఖ్యమంత్రి పీఠమెక్కారు.

ఆ కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఏపీకి వచ్చి, ఎన్నికల ప్రచారం చేస్తే, కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల గెలుపు కోసమే అవుతుంది. అదే జరిగితే, ప్రస్తుతం విజయ్‌ని మోస్తోన్న వైసీపీ క్యాడర్ ఏమైపోవాలి?

నిజానికి, ఇదంతా పవన్ కళ్యాణ్ మీద అక్కసుతో, వైసీపీ విజయ్‌ని మోయడం తప్ప, విజయ్ మీద వైసీపీకి ప్రత్యేకమైన అభిమానం ఏమీ కొత్తగా పుట్టుకొచ్చేయలేదు.

సినిమా

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో...

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

రాజకీయం

హోమ్ మంత్రి అనితపై వ్యాఖ్యలు అభ్యంతరకరం.. రాజకీయాల్లో హద్దులు దాటొద్దు: పవన్ కళ్యాణ్

రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అనితపై ఓ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహిళల కట్టుబొట్టును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర...

అమరవీరులకు పవన్ కళ్యాణ్ నివాళి.. నేషనల్ వార్ మెమోరియల్‌లో భావోద్వేగ క్షణాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. భారత సైనికుల ధైర్యం,...

ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం.. అయిదు కీలక తీర్మానాలకు ఆమోదం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశంలో ఐదు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది....

తప్పుడు ప్రచారమా?.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. డీఎస్సీ నియామకాల్లో కుల ప్రాధాన్యతకు సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ వర్గాల్లో వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద జరిగిన...

దేశ సమగ్రతే జనసేన లక్ష్యం.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ

ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన ‘సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం’ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి...

ఎక్కువ చదివినవి

ఏపీ గ్రామాలకు భారీ వరం.. రూ.16,627 కోట్ల గ్రాంట్ మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి మొత్తం రూ.16,627 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. ఈ నిధులు 2026-27 ఆర్థిక...

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి థియేటర్లలో ఎక్స్‌టెండెడ్ కట్ ప్రదర్శించనున్నారు. ఈ కొత్త...

నందూస్ వరల్డ్ వివాదం ఏమిటి?.. అసలు కథ ఇదే!

తెలుగు సోషల్ మీడియా ప్రపంచంలో “నందూస్ వరల్డ్” పేరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ నందన, ఆమె భర్త మధు ప్రస్తుతం వీసా వ్యవహారానికి సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచారు. యూట్యూబ్ వీడియోలు,...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

‘పెద్ది’కి భారీ వసూళ్లు.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్నప్పటికీ, అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో లాభాలు నమోదు కావడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,...