సినీ నటుడు ప్రకాష్ రాజ్, గత కొద్ది రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకుని, సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు, వీడియోలతో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డూ నాణ్యతపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం చూశాం.
అయితే, పవన్ కళ్యాణ్ అలా సనాతన ధర్మం గురించి మాట్లాడటాన్ని, నాస్తికుడైన ప్రకాష్ రాజ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. సినీ రంగంలో పవన్ కళ్యాణ్ అంటే గౌరవం.. అని పలు సందర్భాల్లో చాటుకున్న ప్రకాష్ రాజ్, ఇప్పుడేమో ఇలా పవన్ కళ్యాణ్ని రాజకీయ శతృవుగా ఫిక్సయిపోయినట్టున్నాడు.
తాజా ట్వీట్లో ‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking’ అంటూ పేర్కొన్నాడు ప్రకాష్ రాజ్.
ఇందులో, ‘పంగనామాలు’ అన్నమాట, ప్రకాష్ రాజ్కే సరిగ్గా సూటవుతుంది. మెగా కాంపౌండ్ నుంచి చాలా సాయాలు పొందిన ప్రకాష్ రాజ్ (సినిమా పరిశ్రమ పరంగా) ఇప్పుడేమో, ఇలా పవన్ కళ్యాణ్కి పంగనామాలు పెడుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
మరోపక్క, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త భక్తుడిగా మారిపోయిన ప్రకాష్ రాజ్, ట్విట్టర్ వేదికగా ఆడుతున్న డ్రామాలు అందరికీ స్పష్టంగానే అర్థమవుతున్నాయి. వైసీపీకి చెందిన చిన్నా చితకా హ్యాండిల్స్ని సైతం ప్రకాష్ రాజ్ ఫాలో అవడం మొదలు పెట్టాడు.
చూస్తోంటే, ప్రకాష్ రాజ్ వైసీపీలో చేరిపోయాడా.? వైఎస్ జగన్కి భక్తుడిగా మారిపోయాడా.? అన్న అనుమానం కలగడం మామూలే. అదే సమయంలో, వైసీపీ విసిరే పేటీఎం బిచ్చానికి తలొగ్గి, ఏకంగా ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్నే అమ్మేసుకున్నాడా.? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయ్.
ఏదిఏమైనా, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. అన్నట్లుంది ప్రకాష్ రాజ్, కొత్త ట్వీట్ల వ్యవహారం.