ఇన్‌సైడ్ స్టోరీ: పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

ఓ ఎమ్మెల్యే తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడానికే ఇష్టపడకపోతే.? ఆ ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక అర్హత లేనట్టే. అలాంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన బాధ్యత స్పీకర్ మీదనే వుంటుంది.

అసెంబ్లీకి హాజరు కాకపోతే, శాసన సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం వుంది.. అలా జరిగితే, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావొచ్చు.. అని తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

‘నువ్ రాజీనామా చెయ్ జగనన్నా.. పులివెందులలో ఉప ఎన్నిక వస్తే, బంపర్ మెజార్టీతో మళ్ళీ గెలుద్దువ్‌.. ఆ ప్రభంజనం రాష్ట్రమంతా వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఇస్తుంది..’ అని వైసీపీ క్యాడర్ కూడా ఒకింత అత్యుత్సాహం చూపుతోంది సోషల్ మీడియా వేదికగా.

వైసీపీ కార్యకర్తల మనోభావాలకు గౌరవమిచ్చే వ్యక్తే అయితే, వైఎస్ జగన్ ఎప్పుడో రాజీనామా చేసి వుండేవారే. అంతే కదా మరి.. అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశ్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదు. ‘అసెంబ్లీకి వెళితే మాత్రం, నాకు మైక్ ఇస్తారా..?’ అని తాజాగా ఇంకోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ప్రతినిథులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.. తనదైన స్టయిల్లో.

ఇదేం పద్ధతి.? అసెంబ్లీలో వున్న 175 మంది సభ్యులకూ మాట్లాడే సమయం దొరుకుతుంది. అందులో ఒకరేమో స్పీకర్. మిగతా 174 మంది సభ్యులకు, వారి వారి హోదాని బట్టి, సమయం దొరుకుతుంది. మంత్రులకు ఒకలా, సాధారణ ఎమ్మెల్యేలకు ఇంకోలా.

వైసీపీకి ప్రతిపక్ష హోదా గనుక దక్కి వుంటే, అది మళ్ళీ వేరే చర్చ. అప్పుడు కూడా, సమయం.. పరిమితంగానే వుంటుంది.. ఎందుకంటే, వైసీపీ సాధించిన సీట్లు జస్ట్ 11 మాత్రమే. గతంలో వైసీపీ ఏం చేసిందో, ఇప్పుడు టీడీపీ కూడా అదే పద్ధతిని అసెంబ్లీలో ఫాలో అవుతుంది మరి.
తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గురించి జగన్ తాను చెప్పిన లెక్కల్ని ఇప్పుడు, ఇంకోసారి ఇంకాస్త సరిగ్గా లెక్కలేసుకుంటే, అసలు జగన్ అనే వ్యక్తి, ప్రతిపక్ష హోదా అడిగే పరిస్థితే రాదు.

ఎటూ అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశ్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదు గనుక, పులివెందుల ఎమ్మెల్యే పదవికి ఆయనే గౌరవంగా రాజీనామా చేస్తే మంచిది. అసెంబ్లీకి జగన్ వెళ్ళకపోతే, ఆయన మీద అనర్హత వేటు పడితే.. అది అవమానకరమైన వ్యవహారమే అవుతుంది. జగన్ రాజకీయ జీవితంలో, అదో మచ్చగా మారిపోతుంది కూడా.

సినిమా

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది....

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్...

యువతకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ మెసేజ్

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇప్పుడు విస్తృత చర్చకు దారి తీసింది. ముఖ్యంగా...

“డెకాయిట్ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్… అందులో డౌట్ లేదు”: వెంకటేష్

పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అడివి శేష్ ఇప్పుడు ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. యాక్షన్, ప్రేమ, భావోద్వేగాలను కలగలిపిన ఈ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి....

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి. డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ కు...

కాకినాడలో ఒక్క గుంత కూడా కనిపించకూడదు.. ప్రతి రెండు నెలలకు వస్తా: పవన్ కళ్యాణ్

కాకినాడ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి కాకినాడ జిల్లా, ముఖ్యంగా కాకినాడ మరియు పిఠాపురం...