టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇల్లూ ఇప్పుడు హోమ్ థియేటర్ లాంటిదే. అందరి ఇళ్ళూ అలాగే వుంటాయ్ అని అనలేంగానీ.. ట్రెండ్ మాత్రం బాగా మారిపోయింది. సో, థియేటర్లకు వెళ్ళి సినిమా చూడటం దండగ.. ఇంట్లోనే ఓటీటీల్లో సినిమాని సకుటుంబ సమేతంగా తిలకించేయడం పండగ.. అని చాలామంది సినీ అభిమానులు భావిస్తున్నారు.
నిజానికి, సినిమాలతో పోల్చితే, వెబ్ సిరీస్లకు అడిక్ట్ అవుతున్నవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. రాజమౌళి లాంటి దర్శకుడే, వెబ్ సిరీస్లలో కంటెంట్ అత్యద్భుతంగా వుంటోందని చెబుతున్నాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడిపోయాయి.
నిజానికి, కరోనా వైరస్ కంటే ముందే, వెండితెరను ఓటీటీ దారుణంగా దెబ్బకొట్టింది. కరోనా వైరస్ లాక్డౌన్ పుణ్యమా అని, సినిమాల ఊసు మర్చిపోయారు జనం.. అనే స్థాయికి వెళ్ళిపోయింది పరిస్థితి. అందుకే, మళ్ళీ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా.? రారా.? అన్న చర్చ జరుగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్, సినిమా థియేటర్లలో మద్యానికి అనుమతిస్తే మంచిదేమోనన్న అంశాన్ని తెరపైకి తెచ్చాడు. దీనికి చాలామంది పాజిటివ్గా స్పందిస్తే, కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.
మరోపక్క, ‘ఓటీటీ ముద్దు, థియేటర్లు వద్దే వద్దు’ అని నెటిజన్లు, సినీ ప్రముఖుల్ని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. ‘మీరేమో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీశామని చెబుతుంటారు.. అందులో కంటెంట్ వుండడంలేదు. దానికి తోడు, ది¸యేటర్లు ప్రేక్షకుల్ని నిలువునా దోచేస్తున్నాయి. మల్టీప్లెక్స్లు మరీ దారుణం’ అని నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్న దరిమిలా, సినీ పెద్దలూ ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకుని, డ్యామేజీ కంట్రోల్ చర్యలకు దిగితేనే మంచిది.
నిజానికి, సినీ పరిశ్రమ ఇలాంటి సంక్షోభాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఆ మాటకొస్తే, ప్రపంచమే చూడలేదు ఇలాంటి ‘లాక్డౌన్’ పరిస్థితుల్ని ఇప్పటిదాకా. లాక్డౌన్ తర్వాత సినిమా మారాల్సిందే. ఎంతలా.. అంటే చాలా చాలా.! అదెలాగన్నది మాత్రం సినీ ప్రముఖులే ఆలోచించుకోవాలి. ఓటీటీ దెబ్బకి సినిమా పరిశ్రమ కుదేలవడం ఖాయం. సినిమా ది¸యేటర్ల పరిస్థితి భవిష్యత్తులో మరీ దయనీయం.!
824590 51607I wish I had a dime for every bad write-up Ive read lately. I also wish other writers had your talent and style. Thank you. 711777
664657 533044I visited a great deal of site but I conceive this one contains something unique in it in it 412