Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: టీడీపీ గ్రాఫ్‌ కిందికి.. జనసేన గ్రాఫ్‌ పైపైకి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంప పెట్టు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అధికారం కోల్పోవడం ఓ ఎత్తయితే.. అత్యంత ఘోరమైన పరాజయం ఇంకో ఎత్తు. మామూలుగా అయితే, ఏ పార్టీ అయినా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కానీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ గడచిన ఏడాది కాలంలో మరింతగా తన స్థాయిని దిగజార్చేసుకుంది తప్ప, ప్రతిపక్షంగా తన ఉనికిని సమర్థవంతమైన రీతిలో చాటుకోలేకపోయింది. టీడీపీతో పోల్చితే జనసేన – బీజేపీ, వామపక్షాలు కాస్తో కూస్తో సమర్థవంతంగా అధికార పార్టీపై పోరాడగలుగుతున్నాయి.

ప్రతి విషయంలోనూ టీడీపీ యాగీ చూస్తోంటే వైసీపీ – టీడీపీ మధ్య ’60-40’ ఒప్పందాలకు అనుకుణంగానే జరుగుతున్నాయా.? అన్న అనుమానం కలగకమానదు. ప్రజా వేదికను కూల్చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇప్పటిదాకా చంద్రబాబు నివాసముంటోన్న గెస్ట్‌ హౌస్‌ని ఖాళీ చేయించలేకపోవడమే ఇందుకు నిదర్శనం. కృష్ణా నదికి వరదలొస్తే, ఆ వరదల పేరుతో టీడీపీ – వైసీపీ చేసిన రాజకీయ యాగీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమరావతి పేరుత చంద్రబాబు సర్కార్‌ కుంభకోణాలకు పాల్పడిందని గతంలో ఆరోపించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక అవే ఆరోపణల్ని కొనసాగించింతి తప్ప.. ఇంతవరకు చంద్రబాబుపైగానీ, ఆయన తనయుడు లోకేష్‌పైనగానీ చర్యలు తీసుకోలేకపోయాయి. ఇలాంటివన్నీ వైసీపీ – టీడీపీ మధ్య ‘కుమ్మక్కు’ రాజకీయాల్ని స్పష్టం చేస్తున్నాయన్న వాదన జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. ఇక, అమరావతి విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. జనసేన పార్టీ ఖచ్చితమైన వ్యూహాలతో ముందడుగు వేస్తోంది.

పార్టీకి వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే చేజారిపోయినా, జనసేన ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. ఇసుక కొరత నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడితే, వారికి అండగా నిలిచింది జనసేన పార్టీ. ఇలా ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా మారుతోంది జనసేన. ఇక, జనసేన మిత్రపక్షమైన బీజేపీ, ఒక్కోసారి వైసీపీకి అనుకూలంగా ఒక్కోసారి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నా, జనసేన మాత్రం మిత్రపక్షం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడం గమనార్హం. ఎలా చూసినా, గడచిన ఏడాది కాలంలో ప్రతిపక్షం టీడీపీ తన గ్రాఫ్‌ని పూర్తిగా పడగొట్టేసుకుంది. రానున్న రోజుల్లో టీడీపీ గ్రాఫ్‌ మరింత తగ్గుతుందని, జనసేన గ్రాఫ్‌ ముందు ముందు పెరగబోతోందనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.

కరోనా వైరస్‌ విషయంలో జనసేన పార్టీ ప్రదర్శించిన రాజకీయ సంయమనాన్ని రాజకీయ విశ్లేషకులు అభినందిస్తున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు జనసేన నేతలు మీడియాలోనూ యాక్టివ్‌ అవుతున్నారు. మీడియా చర్చా కార్యక్రమాల్లో పదునైన వాదనలు విన్పిస్తున్నారు. ఇదివరకు పవన్‌ తప్ప ఇంకెవరి వాయిస్‌ గట్టిగా విన్పించేది కాదు. గ్రౌండ్‌ లెవల్‌లోనూ జనసేన పార్టీ రోజురోజుకీ బలం పుంజుకుంటోంది. ఇక, ప్రతిపక్షం టీడీపీ విషయానికొస్తే.. పార్టీలో కీలక నేతలు, పార్టీ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయినట్లే కన్పిస్తోంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎక్కువ చదివినవి

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...