సినీ పరిశ్రమ నుంచి పెద్దలెవరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ప్రత్యక్షంగా కలిసి అభినందించేందుకు ముందుకు రాని సమయంలో, మెగాస్టార్ చిరంజీవి.. తనంతట తానుగా అమరావతికి వెళ్ళి కలిసిన విషయం విదితమే. అప్పట్లో చిరంజీవిని వైఎస్ జగన్ మోహన్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనపై వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, దాన్ని చిరంజీవి స్వాగతించారు.
ఆ సమయంలో వైసీపీ శ్రేణులు చిరంజీవిని ఓ రేంజ్లో వెనకేసుకొచ్చాయి. అయితే, చిరంజీవి మీద వైసీపీ ‘ప్రేమ’ ఓ భూటకం అని తేలిపోయింది. అదంతా, జనసేనను దెబ్బ కొట్టే ప్రయత్నమని స్పష్టమయిపోయింది. అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటి యెదుట ఈ నెల 29న ధర్నా.. అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం షురూ అయ్యింది ఇటీవలి కాలంలో. దీన్ని వైసీపీ శ్రేణులు ఎడా పెడా సర్క్యులేట్ చేశాయి. టీడీపీలో చిరంజీవిని వ్యతిరేకించేవారు ‘అగ్నికి ఆజ్యం పోసినట్లు’ ఈ వివాదాన్ని మరింత రాజేశారు.
అయితే, అమరావతి జేఏసీ మాత్రం.. తాము అలాంటి ఆందోళన ఏదీ చిరంజీవి ఇంటి ముందు చేయాలని నిర్ణయించుకోలేదని, ఆ ప్రచారంతో తమకు సంబంధం లేదని తేల్చేసింది. ఇప్పుడే అసలు కథ మొదలయ్యింది. సదరు ప్రచారం తాలూకు మూలాలు వైసీపీతోనే ముడిపడి వున్నట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవికి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం.. అంటూ లీకులు అందడం.. ఇదే విషయమై ప్రధానితోనూ, కేంద్ర హోంమంత్రితోనూ వైఎస్ జగన్ చర్చించారంటూ లీకులు రావడం.. ఇవన్నీ చిరంజీవిని వెన్నుపోటు పొడిచే ప్రక్రియలో భాగంగా జరిగినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కాగా, తనను రాజకీయాలతో ముడిపెట్టడం పట్ల చిరంజీవి ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారట. తన దృష్టి పూర్తిగా సినిమాల మీదనే వుందని చిరంజీవి, తన సన్నిహితుల వద్ద తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
195595 444175I conceive this site has got some real great details for everybody : D. 750954
512141 38332Superb weblog here! Furthermore your web website rather a good deal up quickly! What host are you making use of? Can I get your affiliate hyperlink for your host? I wish my website loaded up as fast as yours lol. 616430
643915 244853Just a smiling visitor here to share the adore (:, btw great pattern . 813902