పైత్యం పెరిగిపోతే అంతే మరి.! కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడే బాధ్యతను భుజానికెత్తుకున్న వైద్యుల మీద రాళ్ళు వేయడమా.? ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి వుండదు.! డాక్టర్ల మీద దాడులు కొత్తేమీ కాదు. ప్రభుత్వాలు ఉపేక్షిస్తూ వుండడమే ఈ అనాగరిక చర్యలకు కారణమన్నది నిర్వివాదాంశం. అయితే, ఇప్పుడు పరిస్థితులు మరింత తీవ్రమైనవి. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ కరోనా వైరస్తో పోరాటం చేస్తున్నారు వైద్యులు.
‘రోజులో అతి కొద్ది సమయం మాత్రమే సేద తీరేందుకు అవకాశం దొరుకుతోంది.. మేం ఇంటికి వెళ్ళేందుకూ పరిస్థితులు సహకరించడంలేదు.. ఈ క్రమంలో మా ఇంట్లోవారికి వైరస్ని అంటించే ప్రమాదం రావొచ్చు.. అందుకే, ఇంటికి వెళ్ళడంలేదు. ఏమో, కరోనా బాధితులకు వైద్య చికిత్స అందిస్తోన్న మేం కూడా ఆ వైరస్ బారిన పడి అదే ఆసుపత్రిలో పేషెంట్లుగా మారాల్సి వస్తుందేమో..’ అని వైద్యులు చెబుతున్న మాటలు, వారు పడుతున్న కష్టాన్ని సూచిస్తున్నాయి.
దురదృష్టవశాత్తూ నిన్న దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యుల మీద దాడులు జరిగాయి. హైద్రాబాద్లోనూ అలాంటి ఘటనే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది. అయితే, బాధ్యులపై చర్యలు తీసుకునే సాహసం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం, దాడులకు పాల్పడుతున్నది ఓ మతానికి చెందినవారు. నిజానికి ఈ ‘మతం’ కోణం ఇక్కడ అప్రస్తుతం. దురదృష్టవశాత్తూ ఆ ప్రస్తావన తప్పడంలేదు.
ఎందుకంటే, సదరు మతానికి చెందిన అతి కొద్ది మంది.. ‘మతం’ పేరు చెప్పి యాగీ చేస్తున్నారు మరి. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ నుంచి దేశమంతటా అనూహ్యమైన రీతిలో కరోనా వైరస్ విస్తరిస్తున్న మాట వాస్తవం. ఆ మర్కజ్ నుంచి కొందర్ని క్వారంటైన్కి తరలిస్తే, ఆ క్వారంటైన్ కేంద్రాల్లో ఐసోలేషన్లో వుండాల్సిన వ్యక్తులు.. నిర్వాహకులపై దాడులకు దిగుతున్నారు. ఉమ్మివేస్తూ కరోనా వ్యాప్తికి ప్రయత్నిస్తుండడం అత్యంత శోచనీయం. ‘కొందరు చేసే దుశ్చర్యలు.. మతానికి ఆపాదించడం సబబు కాదు.. దుశ్చర్యలు చేసేవారు సమాజానికి హానికారకులు.. వారికి మతంతో సంబంధం లేదు..’ అని సదరు మత పెద్దలే చెబుతుండడం గమనార్హం.
Doctors & Nurses are risking their lives and trying their best to save us and nation.
Give respect and cooperate with them in every situation. We can't survive without them from this #CoronavirusOutbreak#COVID19Pandemic #COVID https://t.co/oM3IsspgByhttps://t.co/x0MZbrb4aG
— TeluguBulletin.com (@TeluguBulletin) April 2, 2020