కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 35 కోట్ల జనాభా, విశాలమైన వైశాల్యం ఉన్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమవుతోంది. ప్రపంచంలోనే భారీగా కేసులు, మరణాలు అక్కడ నమోదయ్యాయి. అదే 130 కోట్ల జనాభా కలిగిన భారత్ లో తక్కువ కేసులు, మరణాలు నమోదు కావడం.. ఒకరకంగా పరిస్థితి ఇప్పటికీ అదుపులో ఉంది. ఇందుకు కారణాలు ఏమిటి అనేదానిపై కొన్ని విశ్లేషణలు సాగుతున్నాయి.
ముఖ్యంగా మనదేశం ఉష్టమండల ప్రాంతంలో ఉండటం ఒక కారణం కాగా, మలేరియా ప్రభావిత దేశం కావడం మరో అంశమని చెబుతున్నారు. మనదేశంలో మలేరియా జ్వరం సర్వసాధారణం. దోమకాటు వల్ల వచ్చే ఈ జ్వరం చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. అందువల్ల మనదేశంలో మలేరియాను నిరోధించే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు విరివిగా లభ్యమవుతాయి.
ఇప్పుడు ఇదే మందు కోసం అమెరికా సహా 30 దేశాలు భారత్ సాయాన్ని అర్ధిస్తున్నాయి. కరోనాను ఇది కొంతవరకు ఎదుర్కోగలుగుతుందని వారంతా విశ్వసించడమే ఇందుకు కారణం. వైరస్ లు ఎప్పటికప్పుడు ఎలా తమ రూపాన్ని శక్తిని మార్చుకుంటాయో.. మనుషుల్లో ఉండే రోగ నిరోధక శక్తి కూడా పరిస్థితులు, రోగాలకు తగినట్టుగా బలోపేతం అవుతుంది.
ఇదే తరహాలో ఒకప్పుడు మలేరియాతో ఇబ్బందులు పడ్డ మనం.. అనంతరం కాలంలో దానిని విజయవంతంగా ఎదుర్కొన్నాం. దీంతో మన రోగ నిరోధక వ్యవస్థ సైతం మలేరియాను ఎదుర్కొనే విధంగా మారింది. ఇప్పుడు ఇదే మనకు వరమైందని, మలేరియాను ఎదుర్కొనే కణాలు.. కొంతవరకు కరోనాను కూడా సమర్థంగా అడ్డుకుంటున్నాయని తేలింది. భారత్ లో కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి అదే కారణమని తాజాగా చైనాకు చెందిన ఇద్దరు పరిశోధకులు స్పష్టంచేశారు. తమ పరిశోధనలో ఈ మేరకు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయని పేర్కొన్నారు.
అమెరికా, యూరప్ దేశాల్లో మలేరియా ప్రభావం లేదని.. అందువల్లే వారి రోగనిరోధక శక్తి దానికి తగినట్టుగా సంతరించుకోలేదని వివరించారు. దీంతోనే కరోనాతో అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మలేరియా నిరోధానికి వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ డోసులను భారత్ నుంచి పెద్ద సంఖ్యలు కొనుగోలు చేశారు.
755197 628426dress shops that offer discounts are really common in our location and i always shop at them,. 520674