కరోనా మరో ప్రముఖుడిని పొట్టన పెట్టుకుంది. భారత దేశంకు అథ్లెట్ గా ఎన్నో పథకాలను తీసుకు వచ్చిన పరుగుల వీరుడు మిల్కా సింగ్ మృతి చెందారు. ఆయన కరోనా నుండి కోలుకున్న తర్వాత ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. దాంతో ఆయన తుది శ్వాస విడిచినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. 91 ఏళ్ల మిల్కా సింగ్ అర్థరాత్రి సమయంలో చతీస్ ఘడ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మే 24వ తారీకున కరోనాతో మొహాలీలో ఆసుపత్రిలో చేరిన మిల్కా సింగ్ ఆ తర్వాత నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో ఆక్సీజన్ లెవల్స్ పడిపోవడంతో కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఆయన ఇలా అనారోగ్యంతో మృతి చెందడం అందరికి షాకింగ్ గా ఉంది. పలువురు ప్రముఖులు మిల్కా సింగ్ కు ఘన నివాళ్లు అర్పించారు.
1932 లో ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లో జన్మించారు. 1951 లో ఆర్మీలో చేరారు. ఆర్మీ లో నిర్వహించిన పరుగు పందెంలో మంచి ప్రతిభ కనబర్చడంతో అక్కడ నుండి అథ్లెట్ గా ప్రయత్నాలు చేశారు. మిల్కా సింగ్ భార్య నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. ఆమె మృతి చెందిన వెంటనే ఈయన మృతి చెందడం కుటుంబ సభ్యులను మరియు సన్నిహితులను తీవ్రంగా కలచి వేస్తోంది.
717930 883488Aw, this was an exceptionally good post. In concept I would like to spot in writing such as this moreover – spending time and actual effort to create a excellent article but so what can I say I procrastinate alot via no indicates uncover a method to go completed. 845724
178663 510434I enjoy what you guys are typically up too. This kind of clever work and reporting! Keep up the extremely very good works guys Ive added you guys to blogroll. 896338
136263 530070My brother suggested I would possibly like this weblog. He was once entirely right. This submit actually created my day. You cant believe just how so significantly time I had spent for this information! Thank you! 357248