నెలన్నర రోజుల తర్వాత దేశంలో పలు రాష్ట్రాల్లో వైన్స్ ఓపెన్ అయ్యాయి. కాని కొన్ని కారణాల ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రం మద్యం షాప్స్ ఓపెన్ కాలేదు. ఆ రాష్ట్రాల వారు పక్క రాష్ట్రాల నుండి మద్యంను కొనుగోలు చేసి తీసుకు వెళ్తున్నారు. బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద గత వారం రోజులుగా భారీగా మద్యం పట్టుకుంటున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో బీహార్లోని బక్సర్ జిల్లా సిమ్రీ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే కారును సాదారణ చెకింగ్స్లో భాగంగా చెక్ చేస్తున్న సందర్బంగా ఏకంగా 8 బాటిల్స్ మద్యం లభ్యం అయ్యింది.
ఎమ్మెల్యే కారు అయినా కూడా బోర్డర్ వద్ద చెక్ చేయాలని పోలీసులు అన్నారు. దాంతో ఆ కారును క్షుణ్ణంగా చెక్ చేయడంతో మద్యం బాట్టిల్లు లభ్యం అయ్యాయి. ఆ కారు ఎమ్మెల్యేది అయినా కూడా పోలీసులు వదల్లేదు. ఆ మద్యం బాటిల్స్ను స్వాదీనం చేసుకోవడంతో పాటు నలుగురిపై కేసును నమోదు చేశారు. ఈ మద్యం బాటిల్స్ వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులపై దాడికి కూడా ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నించారు.