తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తొమ్మిదో సీజన్ మరింత ఉత్కంఠభరితంగా రానుంది. స్టార్ మా, జియో హాట్ స్టార్ ద్వారా రాబోతున్న ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొనబోతున్నారని హోస్ట్ నాగార్జున ప్రోమోలో వెల్లడించడంతో పెద్ద చర్చ మొదలైంది.
హౌస్లోకి వెళ్లాలనుకున్న వేలాది మంది నుంచి జాగ్రత్తగా ఎంపిక చేసిన 40 మందికి ‘అగ్నిపరీక్ష’ నిర్వహించబోతున్నారు. ఇది సాధారణ టాస్క్ కాదు. ఈ పరీక్షలోనే ఎవరికి హౌస్లో అడుగు పెట్టే అవకాశం దక్కుతుందో నిర్ణయిస్తారు.
ఏ పరీక్షలు, ఎలాంటి టాస్కులు ఉంటాయో తెలుసుకోవాలంటే ‘అగ్నిపరీక్ష’ని తప్పక చూడాలి. జియో హాట్ స్టార్లో మాత్రమే ప్రసారం కానున్న ఈ ప్రత్యేక ఎపిసోడ్లో 40 మందిలో ఎవరు బిగ్ బాస్ 9 హౌస్లోకి వెళ్లనున్నారో, సామాన్యుల స్వరం ఎలా వినిపించబోతుందో చూడాల్సిందే.
