పాకిస్థాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,093FansLike
57,764FollowersFollow

పహల్గాం ఉగ్రాదాడి తర్వాత కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతగా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి అంటూ ఫైర్ అయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో పహల్గామ్‌ అమరులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జనసేన పార్టీ. ఇందులో అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పహల్గాం దాడి పట్ల కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నాం మేమంతా వారి వెంటే ఉంటాం. అక్కడ కేవలం మతాన్ని మాత్రమే టార్గెట్ చేసి చంపేశారు. దీన్ని మాట్లాడుతుంటే కొందరు అలా మాట్లాడొద్దు అంటున్నారు. ఎందుకు మాట్లాడొద్దు. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నా ఉద్దేశం.

ఇలాంటి టైమ్ లో కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారు. సోకాల్డ్ సెక్యులర్లు పాకిస్థాన్ ను ప్రేమిస్తాం అంటున్నారు. అంత ప్రేమ ఉంటే పాకిస్థాన్ కు వెళ్లిపోండి. ఈ దేశంలో ఎందుకు ఉంటున్నారు. పాకిస్థాన్ ఇస్లామిక్ దేశం. కానీ భారత్ హిందూ దేశంగా చెప్పలేం. ఇక్కడ అన్ని మతాల వారికి స్వేచ్ఛ ఉంది. పాకిస్థాన్ లో ఎంత మంది ముస్లింలు ఉన్నారో మన దగ్గర కూడా అంతే మంది ఉన్నారు. అలా ఉన్నారు అంటే ఈ దేశంలో మత పరమైన వివక్ష లేదు. అందరినీ సమానంగా చూస్తున్నాం. జనసేనలో ఎంతో మంది ముస్లిం నాయకులు ఉన్నారు. ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే ముందు గొంతు ఎత్తేది నేనే. కానీ మతం సమస్య కన్నా దేశం సమస్యగా అందరం చూడాలి. ఎక్కడో కశ్మీర్ లో దాడి జరిగితే మనకెందుకు అనుకోవద్దు.

దాని ప్రభావం అందరిపై ఉంటుంది. పహల్గాంలో దాడి జరిగితే జనసేన నేత చనిపోయాడు. అంటే దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. టూర్ కు వెళ్తే చంపేస్తుంటే ఇంక ఏం చేయాలి. మనకు సహనం ఎక్కువ అయిపోయింది. ఇన్ని దాడులు చేస్తున్న టెర్రరిస్టులను ఎందుకు వదిలేయాలి. ఎందుకు చంపకూడదు. మధుసూదన్ గారి భార్య చెప్పే మాటలు వింటే కన్నీళ్లు ఆగట్లేదు. నేను బొట్టు పెట్టుకుంటే గుర్తుపట్టి చంపేశారు అని చెబుతోంది. ఉండాల్సిన ముఖమే లేకుండా కాల్చి చంపేశారు. అత్యంత క్రూరంగా 32 బుల్లెట్లు ముఖం మీద దింపేశారు. తలచుకుంటేనే బాధేస్తుంది. ఒక నమ్మకాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకే ప్రతి దానిపై జనసేన మాట్లాడుతుంది. జనసేనది జాతీయ నినాదం. దేశం కోసం ఆలోచిస్తుంది ఈ పార్టీ.

టెర్రరిస్టులు కాల్చి చంపేస్తుంటే మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కానీ కొందరు మీరెందుకు మాట్లాడుతున్నారు. కొందరి ఓట్లు పోతాయి అంటున్నారు. నేను ఓట్ల కోసం రాజకీయాల్లోకి రాలేదు. మార్పు కోసం వచ్చాను. అందుకే కచ్చితంగా నిజమే మాట్లాడుతాను. ఇన్నేళ్ల తర్వాత కూడా నిజం మాట్లాడకపోతే ఎలా. కాంగ్రెస్ లోచాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకమైపోయాయి. దేశ భద్రత కోసం కేంద్రానికి మద్దతు పలుకుతున్నాయి. జనసేన కూడా అందులో ఉంది. మధుసూదన్ గారి కుటుంబానికి రూ.50లక్షలు విరాళంగా పార్టీ అందజేస్తుంది. ఇదే కాకుండా మున్ముందు అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరింత సాయం అందేలా చూస్తాను. ఇలాంటివి జరగకుండా చేసే బాధ్యత కేంద్రానికి ఉంది. వారికి అందరం అండగా ఉందాం అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్‌.

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

Tollywood: పర్సంటేజీపై పరిశ్రమలో వివాదం..! ఏం జరుగుతుందో..

Tollywood: సినిమాల ప్రదర్శనలో మల్టీప్లెక్స్ లకు ఇచ్చే పర్సంటేజీ విధానాన్ని తమకు ఇవ్వాలని కొందరు ధియేటర్ యజమానులు గతంలో విన్నవించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని 23...

పదవులు కాదు.. పనితీరే కీలకం: లోకేష్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం టిడిపి 3.0 వర్షన్‌తో ముందుకెళ్తోందని, ఇకపై పైరవీలు కాదు.. పనితీరు,...

పులివెందులకు గుడ్ బై.? ‘మావిగన్’ నుంచి పోటీ చేయనున్న జగన్.?

రాయలసీమపై వైఎస్సార్సీపీ ఆశలు వదిలేసుకుందా.? పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయడంలేదా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘మావిగన్’ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా.? ‘మావిగన్’...