ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను ప్రజలెవరూ పట్టించుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. లాక్ డౌన్ పాటించకుంటే కర్ఫ్యూ పెట్టాలంటూ కేంద్రం.. రాష్ట్రాలను ఆదేశించింది. ఓ వైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు ఈనెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తొలుత కొన్ని రాష్ట్రాలు ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. సోమవారం కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం చక్కని స్పూర్తి కనబరిచిన జనం.. ఆ మరుసటి రోజు మామూలుగా రోడ్లపై తిరిగేశారు. దీంతో లాక్ డౌన్ ఉద్దేశం నీరుగారుతోంది. దీనిపై సోమవారమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా స్పందించడంతో పోలీసులు కొన్ని చోట్ల తమ లాఠీలకు పని చెప్పారు. ఎవరూ బయటకు రావొద్దని చెప్పినప్పటికీ జనం వినిపించుకోవడంలేదు. మంగళవారం కూడా చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులే నెలకొనడంతో ఇక ఉపేక్షించి లాభం లేదని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అటు కేంద్రం కూడా నిర్ణయానికి వచ్చింది.
లాక్ డౌన్ అమలుకాని చోట్ల వెంటనే కర్ఫ్యూ విధించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాను కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మంగళవారం సాయంత్రం 8 గంటలకు జాతినుద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, తెలంగాణలో తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య 36కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 7 కేసులు నమోదయ్యాయి.
305520 487710You truly should experience a tournament for starters of the finest blogs online. Let me recommend this fantastic internet site! 741850
962785 696512hello I was extremely impressed with the setup you used with this blog. I use blogs my self so congrats. definatly adding to favorites. 165337
536657 941752Id always want to be update on new articles on this web website , saved to favorites ! . 292941