నిన్నటి రోజున ఏపీ అసెంబ్లీలో పాసైన బిల్లును ఈరోజు మండలి ముందుకు తీసుకొచ్చారు. మండలిలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప జేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఎత్తులు పైఎత్తులు వేస్తూ తెలుగుదేశం పార్టీని వీలైనంతగా అడ్డుకోవాలని చూశారు. కానీ, అది సాధ్యపడేలా కనిపించడం లేదు. నయానో భయానో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ లీడర్ డొక్కా మాణిక్యవర ప్రసాద్ చేత రిజైన్ చేయించారు.
అయన రిజైన్ చేయడంతో తెలుగుదేశం పార్టీ ఆందోళన చెందింది. పార్టీలో ఇబ్బందులు వస్తాయేమో అనుకుంది. ఆ తరువాత అయన తన లేఖను మీడియాకు రిలీజ్ చేశారు. మూడు రాజధానులు వ్యతిరేకంగానే తానూ రిజైన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కొంతమంది వ్యక్తులు సభకు హాజరు కాలేదు. మండలిలో బిల్లును ప్రవేశపెట్టే కంటే ముందు తెలుగుదేశం పార్టీ మండలిలో రూల్ నెంబర్ 71 పై తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై సభలో చర్చ జరుగుతున్నది.
అయితే వైకాపా మంత్రులు మాత్రం దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలి చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, మచ్చ తెచ్చే విధంగా ఉందని అంటున్నారు. కానీ, చైర్మన్ మాత్రం నిబంధనలకు లోబడే సభ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ మండలిలో ఈ బిల్లు పాక్ కాకుంటే తిరిగి వెనక్కి పంపే అవకాశం ఉన్నది. రెండోసారి బిల్లును అసెంబ్లీలో ఆమోదించి ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతారు. అక్కడ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.
లేదంటే దీనిపై ఆర్డినెన్స్ ను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆర్డినెన్స్ తీసుకొస్తే… దానికి కేంద్రం అనుమతి అవసరం అవుతుంది. ఆర్డినెన్స్ ను కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై కోర్టులో కేసులు కూడా వెయ్యొచ్చు. ఇవే కాదు, మండలిని కూడా రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తున్నది. మండలిని రద్దు చేయాలి అంటే కేంద్రం ఆమోదం అవసరం అని, అది అంత ఈజీ కాదని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందో, ఎన్ని గొడవలకు దారితీస్తుందో చూడాలి.
341716 356487Hey there guys, newbie here. Ive lurked about here for a bit even though and thought Id take part in! Looks like youve got quite a very good spot here 773751
698085 563220Wonderful information a lot of thanks sharing and reaching us your subscriber list. 104866
773303 169056I view something genuinely unique in this site . 682472