తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కరోనా బాధితుల ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించిందనే వార్త జనాల్లో ఒక్కసారిగా కలకలం రేగడానికి కారణమైంది. నగరంలోని పలు ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని.. అక్కడి ప్రజలను 14 రోజులపాటు ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని పేపర్లో వచ్చిన వార్తలు భయాందోళనలు కలిగించాయి.
దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు. అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. చాలా అపార్లమెంట్ల గేట్లకు తాళాలు వేసి బయటి వారిని లోనికి.. లోపలున్నవారిని బయటకు పంపించకుండా నిరోధిస్తున్నారు. ఆయా అపార్టమెంట్లలో ఉన్న అత్యవసర సేవలకు సంబంధించిన సిబ్బందిని సైతం బయటకు వెళ్లడానికి వీల్లేదని ఖరాకండీగా చెప్పేస్తున్నారు.
దీంతో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రాజధానిలో ఎలాంటి రెడ్ జోన్లు ప్రకటించలేదని సర్కారు స్పష్టంచేసింది. లేనిపోని వార్తలతో ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగించొద్దంటూ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు సూచించారు. హైదరాబాద్ లో రెడ్ జోన్లు అని వేటినీ ప్రకటించలేదన్నారు. మరోవైపు ప్రజలకు అవసరమైన పాలను ఆన్ లైన్ లో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తలసాని తెలిపారు.
609457 269523Wonderful post, I feel site owners should acquire a lot from this internet site its very user pleasant. 25378
13373 903978This web site is my aspiration , very amazing pattern and perfect articles . 953533