Switch to English

తమిళనాడులోని తెలుగు హిందూ ఓటర్లపై పవన్ కళ్యాణ్ ప్రభావమెంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

‘సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి.. సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం..’ అని విపరీత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్‌పై ఆయన పేరు ప్రస్తావించకుండానే తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.!

‘కొందరు సనాతన ధర్మాన్ని అంతం చేస్తామంటున్నారు.. కానీ, వాళ్ళే అంతమైపోతారు..’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అక్కడి నుంచి తమిళనాడులో రాజకీయ చర్చలు, పవన్ కళ్యాణ్ కేంద్రంగా సాగడం మొదలైంది.

తమిళనాడులో తెలుగు హిందూ ఓటర్ల సంఖ్య ఎంత.? వారిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావమెంత.? పవన్ కళ్యాణ్‌ని బీజేపీ, తమిళనాడులో తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలనుకుంటోందా.? ఏఐఏడీఎంకే – బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ బీజం వేస్తున్నారా.? ఇలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

బీజేపీ తరఫున అన్నామలై, తమిళనాడులో చాలా యాక్టివ్‌గా వున్నారు. తమిళనాడులో ఒకప్పుడు బీజేపీకి అసలు ఓటు బ్యాంకు అనేదే లేదు. ప్రస్తుతం పది శాతానికి కాస్త అటూ ఇటూగా మారిందంటే, అది అన్నామలై ప్రభావం వల్లనే. ఆ అన్నామలైకి తోడు, పవన్ కళ్యాణ్ ‘సనాతన ధర్మ పరిరక్షణ’ పోరాటం, తమిళనాడులో తెలుగు హిందూ ఓటర్లనే కాదు, సంప్రదాయ తమిళ హిందూ ఓటర్లనూ బీజేపీ వైపు చూసేలా చేస్తోంది.

నిజానికి, ఏఐఏడీఎంకే – డీఎంకే.. ఈ రెండు పార్టీల భావజాలం కూడా దాదాపు ఒక్కటే. అదే పెరియార్ భావజాలం. అయినాగానీ, సనాతన ధర్మం విషయంలో డీఎంకేతో పోల్చితే, ఏఐఏడీఎంకే కాస్త బెటర్. ఆ ఏఐఏడీఎంకే, జయలలిత మృతితో బలహీనపడినా, ఆ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఇంకా బలంగానే వుంది.

తమిళ నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్న దరిమిలా, తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. అన్నామలై లాంటి యంగ్ లీడర్, విజయ్ లాంటి స్టార్ హీరో.. బలమైన ఓటు బ్యాంకు వున్న డీఎంకే, ఏఐఏడీఎంకే.. ఇన్ని రాజకీయ సమీకరణాల నడుమ, తమిళనాడు రాజకీయాల్లో సంప్రదాయ తెలుగు హిందూ ఓటు బ్యాంకు కూడా కీలకంగా మారబోతోంది.

కొన్ని నియోజకవర్గాల్లో ఈ ఓటు బ్యాంకు పది నుంచి పన్నెండు శాతం వరకూ వుండొచ్చన్నది ఓ అంచనా. అదే ఇప్పుడు డీఎంకే పార్టీకి పెద్ద తలనొప్పిలా మారబోతోందన్నది తమిళ రాజకీయ విశ్లేషకుల అంచనా.

అన్నట్టు, తెలుగు మీడియాతో పోల్చితే తమిళ మీడియా మరింత భిన్నం. డీఎంకే కనుసన్నల్లోనే మెజార్టీ మీడియా సంస్థలు పని చేస్తున్నాయ్. అందుకే, సోషల్ మీడియా వేదికగా తమిళ జనాలు.. సనాతన ధర్మం గురించీ, పవన్ కళ్యాణ్ గురించీ పాజిటివ్‌గా స్పందిస్తుండడం గమనార్హం.

ఈ తమిళ రాజకీయాలు మనకెందుకు.? అన్న చర్చ కొందరు జనసైనికుల్లోనూ జరుగుతున్నా, సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యతను భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ గురించి దేశవ్యాప్తంగా సగటు హిందువులంతా చర్చించుకుంటూనే వున్నారు. ఆయన తెగువని కొనియాడుతూనే వున్నారు.

కొసమెరుపేంటంటే, తమిళనాడులోని తెలుగు హిందువులే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని తమిళ హిందువుల దృష్టిలోనూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టార్‌డమ్ అనూహ్యంగా పెరిగిపోయిందిప్పుడు.! సనాతన ధర్మ పరిరక్షణ కోసం నినదిస్తూనే, ఇతర మతాల్ని సైతం అంతే బాధ్యతగా గౌరవిస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. ఆ కోణంలోనూ ఆ వర్గాల్లోనూ ప్రశంసల్ని పొందుతున్నాయి.

సినిమా

Tollywood: ప్రముఖ సినిమా విలన్ కన్నుమూత.. ‘కృష్ణ’తో తెలుగులో గుర్తింపు

Mukul Dev: తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ‘ముకుల్ దేవ్’ కన్నుమూశారు. ఆయన వయసు 54ఏళ్లు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న...

ప్రభాస్ కోసం కన్నడ భామ..?

రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సందీప్ వంగ...

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

లిక్కర్ స్కామ్.! వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది.! పెద్ద తలకాయ్ ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

రాక్షస యుగం.! వైఎస్ జగన్ కొత్త ప్రసంగం.!

‘ఈ కలి యుగంలో.. అంటే, చంద్రబాబు యుగంలో..’ అంటూ, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. కలి యుగంలో రాజకీయాలు చేయాలంటే,...

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

Farmer: రైతు ఆవేదన.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. కేంద్ర మంత్రి స్పందన

Farmer: దుక్కి దున్ని, ఆరుగాలం కష్టించే రైతుకే తెలుసు పంట విలువ. రేటు రాకపోయినా తర్వాతి పంట పండించేందుకు సిద్ధమయ్యే నిజమైన అన్నదాత. అటువంటి రైతుకే కష్టం వస్తే సమాజానికి మంచిది కాదు....