Switch to English

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,803FansLike
57,764FollowersFollow

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ.. కర్ణాటకలోని 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్ లో పడ్డారంటూ సంచలన ప్రకటన చేశారు. ఇందులో అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఉన్నారని.. కేంద్ర స్థాయి లీడర్లు కూడా హనీట్రాప్ లో పడ్డారంటూ దుమారం రేపారు. ఈ వ్యాఖ్యలపైనే కర్ణాటక బీజేపీ, జనతాదళ్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. బడ్జెట్ సమావేశాల్లో హనీట్రాప్ పై సీబీఐ విచారణ జరిపించాలంటూ బీజేపీ, జనతాదళ్ పట్టుబట్టాయి.

బడ్జెట్ సమావేశాలపై సీఎం సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న టైమ్ లో బీజేపీ, జనతాదళ్ సభ్యులు తీవ్ర ఆందోళన చేశారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి హనీట్రాప్ మీద విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశ ప్రతులను, అలాగే కాంట్రాక్టుల్లో ముస్లింలకు చేసిన 4 శాతం రిజర్వేషన్లను చింపేసి స్పీకర్ మీద విసిరేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బుక్ లను ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై విసిరేశారు. స్పీకర్ మీద ఇలా చేసినందుకు విపక్ష ఎమ్మెల్యేలను 16 మందిని ఆరు నెలల పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.

ఇదే హనీ ట్రాప్ మీద హోంమంత్రి జి.పరమేశ్వర్ కూడా స్పందించారు. హనీట్రాప్ మీద తోటి మంత్రి ఆరోపణలు చేశారు కాబట్టి కచ్చితంగా దాన్ని సీరియస్ గా తీసుకుంటామని.. హనీట్రాప్ కు పాల్పడ్డ ఎవరినీ వదిలిపెట్టేది లేదని ప్రకటించారు. అటు సిద్ధరామయ్య కూడా దీనిపై స్పందించారు. హనీట్రాప్ కు పాల్పడ్డ ఎవరినీ వదిలిపెట్టేది లేదని.. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. కర్ణాటకలో హనీట్రాప్ ఆరోపణలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. కానీ అవేమీ అంతగా నిలబడలేకపోయాయి. కానీ ఈ సారి నటి రన్యరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో ఈ ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.

గోల్డ్ స్మగ్లింగ్ లో సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మందే ఉన్నారని.. రన్యరావు వెనకాల రాజకీయ నేతలు ఉన్నారనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. కానీ ఆ కేసు మీద అటు అధికార పార్టీ నేతలు గానీ… ఇటు ప్రతిపక్ష నేతలు గానీ నేరుగా ఎలాంటి డిమాండ్లు చేయకపోవడం గమనార్హం. గోల్డ్ స్మగ్లింగ్ మీద నేరుగా మాట్లాడకపోయినా ఇప్పుడు హనీట్రాప్ వ్యవహారానికి గోల్డ్ స్మగ్లింగ్ కు లింకులు ఉన్నాయనే వార్తలు కర్ణాటక మీడియాలో వస్తున్నాయి. ఇది సిద్ధరామయ్య ప్రభుత్వానికి సవాల్ గా మారిపోయింది. మరి ఈ హనీట్రాప్ వ్యవహారంపై ఆయన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే అంటున్నారు.

సినిమా

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

ఎక్కువ చదివినవి

ఏపీ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది

ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్( Mega DSC Notification -2025) పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తాము అధికారంలోకి రాగానే ఖాళీగా...

కీరవాణి, చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, పాటల రచయిత చంద్రబోస్ ల మీద సంచలన ఆరోపణలు చేసింది సింగర్ ప్రవస్తి ఆరాధ్య. పాడుతా తీయగా షో గురించి అందరికీ తెలిసిందే. ఎస్పీ...

వైసీపీ చేజారిన జీవీఎంసీ మేయర్ పీఠం: ఇది దేవుడి స్క్రిప్ట్.!

వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయో చూశాం. ఎన్ని అరాచకాలు చేసి ఆయా కార్పొరేషన్లను వైసీపీ దక్కించుకుందో, సాక్ష్యాలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అందుబాటులోనే వున్నాయి. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన...

క్రైస్తవ ధర్మ పరిరక్షణ ఎక్కడ జగన్.?

మొన్నీమధ్యన శ్రీరామ నవమి సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ‘హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్’ అంటూ ట్వీట్లు హోరెత్తాయ్. దాదాపు 17 ట్వీట్లు, జగన్ ఫొటోలతో ‘హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్’...

వేట మొదలైంది.. ప్రశాంత్ నీల్ ప్రపంచంలో అడుగు పెడుతున్న టైగర్..

సెన్సేషనల్ కాంబో కలయికకు టైమ్ ఆసన్నం అయింది. సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైంది....