YS Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి (YS Avinash Reddy) తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈనెల 27న వాదనలు ముగించిన హైకోర్టు (High Court) నేడు తీర్పు వెలువరించింది.
ఈక్రమంలో సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి అవినాశ్ రెడ్డి వెళ్లకూడదు. కేసు విషయంలో స్థానికులను ప్రభావితం చేయోద్దని ఆదేశించింది. సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని అవినాష్ ను హైకోర్టు ఆదేశించింది. సీబీఐకి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు అవినాశ్ కోర్టుకు విన్నవించారు. సీబీఐ ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. వైఎస్ సునీత తరపున న్యాయవాదులు కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.