తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాలపై హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని.. ఆ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంటల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గణేశ్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేయకుండా ఆదేశించాలని న్యాయవాది మామిడి వేణుమాధవ్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎకో ఫ్రెండ్లీ విఘ్నేశ్వరుడి విగ్రహాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రచారం చేయాలని ఆదేశించింది.
నిమజ్జననం సమయంలో హుస్సేన్ సాగర్ లో ట్యాంక్ బండ్ వైపు నుంచి కాకుండా పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్కు రోడ్డు తదితర ప్రాంతాల్లో చేసుకోవచ్చని తెలిపింది. హుస్సేన్ సాగర్ లో రబ్బర్ డ్యాంలు ఏర్పాటు చేసి నిమజ్జనం చేయాలని ఆదేశించింది. నిమజ్జనం తర్వాత హుస్సేన్ సాగర్ లోని వ్యర్ధాలను తొలగించాలని కూడా ఆదేశించింది. చిన్న విగ్రహాలను ప్రజలు ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేసుకోవాలని కోరింది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు హుస్సేన్ సాగర్ వైపు రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిమజ్జనం సమయంలో ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని.. నిమజ్జనం రోజు ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. రోడ్లపై ప్రజలకు ఇబ్బంది కలిగించేలా మండపాలు ఏర్పాటు చేయకుండా చూడాలని.. సాంస్కృతిక కార్యక్రమాలు నియంత్రణలో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల తర్వాత మైకులు నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసులు ఖచ్చితంగా పాటించాలని.. మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
475285 258528Awesome read , Im going to spend far more time researching this topic 262034
281974 739524I observe there is lots of spam on this weblog. Do you need to have assist cleaning them up? I may help among classes! 875954
355790 647438I like this site extremely considerably, Its a rattling nice location to read and get info . 264157
818264 726442Glad to be among the visitors on this awe inspiring internet site : D. 632490