మన టాలీవుడ్ హీరోలు వదులుకున్న హిట్ సినిమాలు ఇవే ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,075FansLike
57,764FollowersFollow

కొన్ని కొన్ని సినిమాలు విచిత్రమైన కాంబినేషన్ లో తెరకెక్కుతాయి. సినిమా విషయంలో హీరోని అడిగితే .. కథ బాగా నచ్చింది. ఇందులోని కీ పాయింట్ చాలా ఇంపాక్ట్ కలిగించింది అందుకే ఈ కథకు ఓకే చెప్పాను అని చెబుతాడు. అయితే కొన్ని కొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా హీరోలు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. తాను వదులుకున్న కథను మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే అయ్యో .. అని నాలుక కరుచుకోవడం కామనే ! తెలుగులో అలాంటి సినిమాలు మిస్ అయిన హీరోలు, కథ నచ్చకో .. కథ చెప్పినప్పుడు మరో మూడ్ లో ఉండో వదులుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. నిజమే వద్దంటే అంతే మరి? అనుకునేలా చేస్తూంటాయి. మరి అలాంటి సినిమాలు ఏమిటి ? ఏ హీరో ఏ కథను వదులుకున్నాడో ఓ లుక్ వేద్దామా ..

శ్రీమంతుడు ..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని మహేష్ ని సూపర్ స్టార్ గా మరో మెట్టు ఎక్కించింది. నిజానికి ఈ కథను ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడట ? ఏంటి షాక్ అవుతున్నారా ? మీరు వింటున్నది నిజమే. కొరటాల శివ ముందు ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పాడట .. కానీ ఎందుకో ఈ కథ ఎన్టీఆర్ ని అంతగా ఇంపాక్ట్ చేయకపోవడంతో మరో కథ చెప్పండి అని అడిగాడట ఎన్టీఆర్. శ్రీమంతుడు కథ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ కోసం జనతా గ్యారేజ్ కథ చెప్పాడు కొరటాల. మరి శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఎన్టీఆర్ వదులుకున్నాడన్నమాట. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు .. ఈ కథను ఆ తరువాత రామ్ చరణ్ కూడా వదులుకున్నాడట. ఎన్టీఆర్ శ్రీమంతుడు కథకు నో చెప్పడంతో అదే కథను రామ్ చరణ్ కు చెప్పాడట కొరటాల. ఊరిని దత్తత తీసుకోవడం లాంటి పాయింట్ నా ఇమేజ్ కుదురుతుందా అనే డౌట్ తో చరణ్ నో చెప్పాడట. మొత్తానికి శ్రీమంతుడు లాంటి సంచలన విజయాన్ని అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ వదులుకున్నారన్నమాట.

పవన్ కళ్యాణ్ ఇడియట్ ని మిస్సయ్యాడు ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పూరి జగన్నాధ్ ఆ తరువాత రవితేజతో తెరకెక్కించిన ఇడియట్ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. చిన్న హీరోగా ఉన్న రవితేజని స్టార్ గా నిలబెట్టింది ఇడియట్ సినిమా. నిజానికి ఈ కథను ముందు పవన్ కళ్యాణ్ కె చెప్పాడట పూరి జగన్నాధ్. అయితే ఎందుకో ఈ కథ పవన్ కళ్యాణ్ కు నచ్చలేదని చెప్పేశాడట .. దాంతో ఆ కథను రవితేజ కు చెప్పడం .. ఇడియట్ గా రవితేజ సంచలన విజయాన్ని అందుకోవడం మనకు తెలిసిన విషయాలే. ఇక మహేష్ కెరీర్ లో సంచలన విజయాన్ని అందుకున్న అతడు సినిమా కథ కూడా ముందు పవన్ కళ్యాణ్ దగ్గరికే వెళ్ళింది. త్రివిక్రమ్ దర్శకుడిగా టెక్నీకల్ స్టాండర్డ్ తెలిపిన సినిమా అది. పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో ఆ కథను మహేష్ కి చెప్పి అతడుగా సంచలన విజయాన్ని అందించాడు త్రివిక్రమ్. ఇదే లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ ఆర్య అయ్యుంటే ..

అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన సినిమా ఆర్య. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ హీరోగా ఎలా నిలబడతాడో అన్న సంశయం ఏర్పడింది అందరిలో. దాన్ని పటాపంచలు చేస్తూ సుకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతూ .. ఆర్య చిత్రాన్ని తెరకెక్కించాడు. ముందు ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పడంతో మాస్ ఇమేజ్ ఉన్న నేను లవ్ స్టోరీ చేస్తే జనాలు చూస్తారా అనే అనుమానాన్ని ఎన్టీఆర్ వ్యక్తం చేస్తాడట, దాంతో ఆ కథను అల్లు అర్జున్ కు చెప్పి ఒప్పించాడు సుకుమార్. ఇక ఆర్య గా అల్లు అర్జున్ రేపిన దుమారం అంతా ఇంతా కాదు. మొత్తానికి ఎన్టీఆర్ అలా ఆర్య ను మిస్సయ్యాడు.

దిల్ మిస్సయిన హీరో ?

మాస్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న వినాయక్ ఆది సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆ తరువాత దిల్ కథను ముందు ఎన్టీఆర్ కు చెప్పాడట వినాయక్. అప్పటికే ఆది సినిమా చేశాను కాబట్టి మళ్ళీ ఇలాంటి కథ చేయలేను అని చెప్పడంతో ఆ కథను హీరో నితిన్ కి చెప్పడంతో నితిన్ ఓకే అనడం .. దిల్ సినిమా సంచలన విజయం అందుకోవడంతో నితిన్ కి మంచి మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చింది దిల్. ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మెన్ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు. ఈ సినిమా డైలాగ్స్ ఇప్పటికి పలు సినిమాల్లో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ కథను మొదటి తమిళ హీరో సూర్య కు వినిపించాడట పూరి. ఎందుకో ఈ కథ సూర్యకు నచ్చకపోవడంతో అది మహేష్ కి చేరింది. ఇక నాగ చైతన్య, సమంత జంటగా వచ్చిన ఏ మాయ చేసావే సినిమా సంచలన విజయాన్ని అందుకుని నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ కథను గౌతమ్ మీనన్ ముందు మహేష్ బాబుకు చెప్పాడట. మరి ఇంత క్యూట్ లవ్ స్టోరీ ని తాను చేయలేనని మహేష్ చెప్పడంతో ఆ కథ నాగ చైతన్య దగ్గరికి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా సినిమాలే ఉన్నాయి.

13 COMMENTS

సినిమా

“సీట్ ఎడ్జ్ సస్పెన్స్… ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై దర్శకుడు మునిరాజు నమ్మకం”

హీరో Kiran Abbavaram న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

రాజకీయం

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: ధైర్య నిర్ణయాలు ధనుస్సుకు అనుకూలం… ఖర్చుల్లో జాగ్రత్త తులకు అవసరం

ఏప్రిల్ 8 , 2026 బుధవారం రాశిఫలాలు బుధవారం రోజున గ్రహస్థితి ప్రభావంతో కొన్ని రాశుల వారికి ధైర్యం, నిర్ణయశక్తి, పనుల్లో పురోగతి కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కొందరు ఖర్చులు, కుటుంబ...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన కామెంట్స్ తీవ్ర...

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 13 సంవత్సరాల లోపు బాలలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా...

పెళ్లి బ్రేక్ తర్వాత నార్నే నితిన్ కొత్త సినిమా ఫిక్స్

పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న నార్నే నితిన్ ఇప్పుడు మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆయన...

ధాన్యం అమ్మితే.. గంటల్లోనే డబ్బులా?

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, రైతులకు చెల్లింపుల వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రైతులు ధాన్యం అమ్మిన వెంటనే లేదా చాలా తక్కువ సమయంలోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని...