ప్రస్తుతం ఇండియా-పాకిస్థాన్ నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు టర్కీ సాయం చేస్తూ తన వక్రబుద్ధి చాటుకుంది. మన దేశం మీద పాకిస్థాన్ దాడి చేసిన డ్రోన్లు అన్నీ టర్కీ దేశం ఇచ్చినవే. అప్పటి నుంచి టర్కీని బ్యాన్ చేయాలనే డిమాండ్ పెరిగింది. ఆ దేశంపై ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నిఖిల్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో టర్కీ దేశ అధ్యక్షుడి వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాట్లాడుతూ.. ఏదేమైనా మేం పాకిస్థాన్ నే సపోర్ట్ చేస్తాం. ఆ దేశంతోనే కలిసి ముందుకు వెళ్తాం అంటూ ప్రకటించాడు.
ఆ నెటిజన్ పోస్ట్ ను రీ ట్వీట్ చేసిన నిఖిల్.. ‘ఇప్పుడు చెప్పండి ఆ టర్కీ దేశం వెళ్తారా. మన వాళ్లు చాలా మంది ఆ దేశం వెళ్లి అక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలాంటి దేశం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఆ దేశం వస్తువులు కూడా వాడొద్దు’ అంటూ రాసుకొచ్చాడు నిఖిల్. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నిఖిల్ ను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నిఖిల్ నిజమైన దేశభక్తుడు కాబట్టే ఇంత ధైర్యంగా మాట్లాడాడు అంటున్నారు.
