Switch to English

Karthi Birthday special: ‘ఎవర్రా మీరంతా..’ అనేంత అభిమానం కార్తీ సొంతం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఓటీటీలు వచ్చి సినిమా గ్లోబల్ రీచ్ అయింది. కానీ.. దీనికంటే ఎన్నోఏళ్ల ముందే తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చితే భాషా భేదం లేకుండా ఆదరిస్తారని దేశంలోని ప్రతి సినీ పరిశ్రమ చెప్పే మాట. అలా మెచ్చిన హీరో కార్తీ. తమిళ హీరో శివకుమార్ రెండో కుమారుడు. స్టార్ హీరో సూర్యకు తమ్ముడు. రజినీకాంత్, కమల్ హాసన్ తరం తర్వాత విక్రమ్, సూర్య వంటివారికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే ఉంది. వీరికి ధీటుగా కార్తీ కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి కంటెంట్ సినిమాలతో మిగిలిన హీరోలు రికగ్నిషన్ పొందితే.. సాధారణ సినిమాలే చేసినా తన మార్క్ యాక్షన్, లుక్స్, చలాకీతనంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచాడు కార్తీ. నేడు ఆయన పుట్టినరోజు.

తెలుగువారినీ మెప్పించి..

తొలి సినిమా పరుత్తివీరన్ తోనే ప్రేక్షకులను మెప్పించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేసిన యుగపురుషుడుతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీ. ఎంతంటే సినిమాలోని ‘ఎవర్రా మీరంతా..’ అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా రౌండ్ అయ్యేంతగా. కార్తీ తన సినిమాల్లో చలాకీగా నటిస్తాడు. మాస్ ను మెప్పించే లక్షణాలు, ఫ్యామిలీస్ ను ఆకట్టుకునే నటన కార్తీ సొంతం. అదే అటు తమిళ ప్రేక్షకుల్ని ఇటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ముఖ్యంగా కార్తీ తెలుగులో మాట్లాడే విధానం మరింతగా ఆకట్టుకుంటుంది. అదే తెలుగులో కూడా కార్తీకి అభిమానుల్ని సంపాదించిపెట్టింది. తమిళంలో అప్పటికే స్టార్ హీరోలుగా ఉన్నవారికి కూడా లేనంతగా తెలుగులో కార్తీ మార్కెట్ ఉంది.

నటనలో సత్తా చూపి..

కార్తీ సినిమాలు ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతాయి. తెలుగు స్ట్రెయిట్ సినిమా ఊపిరితో ఆకట్టుకున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీతో కార్తీ తన నటనలోని సత్తా చూపాడు. పొన్నియన్ సెల్వన్ లో అల్లరి పాత్రతో మెప్పించాడు. స్టార్ హీరో తమ్ముడనే గుర్తింపు నుంచి బయటకొచ్చి పేరు తెచ్చుకోవడం పవన్ కల్యాణ్, పునీత్ రాజ్ కుమార్ తర్వాత కార్తీనే అని కింగ్ నాగార్జున అన్న మాట నిజం. తెలుగులో కార్తీకి ఉన్న క్రేజ్.. ఓ సినిమా ప్రమోషన్ కు హైదరాబాద్ వస్తే ఈలలు గోల చేసేంత. ‘ఎవర్రా.. మీరంతా.. నన్ను ఇంత అభిమానిస్తున్నారు’ అని వారిని ఆప్యాయంగా పలకరించేంత. భవిష్యత్తులో కార్తీ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...