భారీ వర్షాలతో మహారాష్ట్ర అల్లాడిపోతోంది. రాయ్ ఘడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం చెందారు. మహాద్ తలై సహా మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొందరు శిథిలాల్లో చిక్కకుపోయారు. ఈ విపత్తు గురించి సమాచారం అందుకున్న నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో 30 మంది వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడిన మార్గం ముంబై-గోవా హైవే కావడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది.
వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు రత్నగిరి, కొల్హాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొల్హాపూర్ లో ముంబై-బెంగళూరు హైవేపై ఓచోట రోడ్డు కుంగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రత్నగిరి జిల్లాలో అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. ఈ ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షపాతం నమోదు కావడమే ఈ పరిస్థితులకు కారణమని అంటున్నారు.
756691 152482I discovered your blog web site website on the search engines and check several of your early posts. Always preserve up the quite very good operate. I recently additional increase Rss to my MSN News Reader. Seeking for toward reading a lot much more on your part later on! 467959
797989 656645so considerably excellent information on here, : D. 676470