ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద నీరు పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం రాత్రి 8గంటల సమయానికి గోదావరి నీటి మట్టం 48.30 అడుగులకు చేరుకుంది. గోదావరి ప్రవాహం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
రామాలయం పడమర మెట్లు, అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరింది. మరోవైపు దిగువ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాలకు వెళ్లే రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల, దమ్ముగూడెం, వెంకటాపురం మండలాలకు వెళ్లే దారిలో వరద నీరు చేరింది.
ఎగువ వర్షాలతో గోదావరి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర సాయం కోసం 08744-241950, 08743-232444 నెంబర్లకు ఫోన్ చేయాలని.. 93929 19743 నెంబరుకు ఫొటోలు పంపాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు.
183458 673989There is noticeably a bundle comprehend this. I suppose you created specific good points in functions also. 361346
789228 587882Fantastic beat ! I wish to apprentice whilst you amend your web site, how can i subscribe for a blog web site? The account aided me a appropriate deal. I had been just a little bit acquainted of this your broadcast provided bright clear concept 903405