ఏఎస్సై జరిపిన కాల్పుల్లో ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్ దాస్ మృతి చెందారు. ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన. తీవ్రంగా గాయపడి భువనేశ్వర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం మంత్రి మృతి చెందారు. ఛాతీ భాగంలో రెండు బుల్లెట్లు దిగడంతో తీవ్ర రక్తస్రావమై మంత్రి మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆదివారం ఉదయం ఝార్సుగూడ జిల్లా బ్రిజ్ రాజ్ నగర్ గాంధీ చౌక్ చేరుకున్న మంత్రి కారు దిగుతూండగా ఏఎస్సై గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. ఎయిర్ ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా.. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. జరిగిన దారుణంపై సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆసుపత్రికి సీఎం చేరుకుని మంత్రి కుటుంబసభ్యులను పరామర్శించారు. బిజూ జనతాదళ్ పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారని.. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఏఎస్సైను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు మానసిక పరిస్థితి సరిగాలేదని కుటుంబసభ్యులు అంటున్నారు.
910093 381217I was searching at some of your articles on this site and I believe this internet internet site is truly instructive! Maintain on posting . 308400
605524 883467Ive applied the valuable points from this page and I can undoubtedly tell that it gives a great deal of assistance with my present jobs. I would be really pleased to keep acquiring back in this internet page. Thank you. 617065
381538 549654I like this site really significantly so a lot excellent data. 898822
152798 961334Hello! Fantastic post! Please when I could see a follow up! 668873