విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రస్తావన తీసుకొచ్చి కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. హైదరాబాద్ పై ఇంకా ఆంధ్ర పెత్తనం ఉండాలని ఉత్తమ్ కోరుకుంటున్నట్టు ఉందని విమర్శించారు. ఇటివల తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్షన్-8 ప్రస్తావన తెచ్చారు. దీంతో మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సచివాలయ భవనాల కూల్చివేతపై ఉత్తమ్ స్పందించారు. 2012-13 కాలంలో పూర్తైన భవనాలను కూల్చివేయడం దారుణమని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ వాస్తు పిచ్చికి ఇది పరాకాష్ట అని అన్నారు. ఈమేరకు గవర్నర్ విభజన చట్టం ప్రకారం సెక్షన్-8 అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దీనికి హరీశ్ స్పందిస్తూ.. ‘ఏపీ ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన ఉత్తమ్ కు ఇంకా ఆ భావాలు పోలేదని అర్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా సెక్రటేరియల్, ప్రభుత్వ భవనాలను అప్పగించిన తర్వాత ఇక సెక్షన్-8 కు ఆస్కారం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఇంకా హైదరాబాద్ పై ఆంధ్ర పెత్తనం ఉండాలని కోరుకుంటున్నారా’ అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
17428 672875Hello! I just wish to give a huge thumbs up for the great info youve gotten appropriate here on this post. I will likely be coming back to your weblog for far more soon. 157761
164779 389898Some really excellent articles on this site , thankyou for contribution. 522732
830554 347216Most suitable boyfriend speeches, or else toasts. are almost always transported eventually by means of the entire wedding party and are still required to be extremely intriguing, amusing and even enlightening together. finest mans speech 953013