Switch to English

గ్రౌండ్‌ రిపోర్ట్‌: వైఎస్‌ జగన్‌ పాలన.. ఇలాగైతే కష్టమేనట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

రోజులు గడుస్తున్నాయ్‌.. నెలలు గడిచిపోతున్నాయ్‌.. అయినా, ఇంకా అభివృద్ధి దిశగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం సరైన అడుగు వేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకంలో ఒకింత అసహనం స్పష్టంగా కన్పిస్తోంది. సంక్షేమ పథకాల విషయంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనను తప్పు పట్టడానికి వీల్లేదు. ఎడా పెడా కొత్త కొత్త పథకాలు పుట్టుకొచ్చేస్తున్నాయ్‌.! విపక్షాల ఆందోళనలకు తలొగ్గుతున్నారో, లేదంటే.. సంక్షేమ పథకాల పట్ల వ్యతిరేకత పెరిగితే, అది ప్రభుత్వానికి ముప్పు తెస్తుందని ఆందోళన చెందుతున్నారోగానీ, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. ఏ చిన్న సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చినా వెంటనే పరిష్కరించేస్తోంది..

అది సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రమే. పెన్షన్లు తదితర వ్యవహారాల్లో ఈ స్పీడు కన్పిస్తోంది. కానీ, కీలకమైన విషయాల పట్ల వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అస్సలేమాత్రం వేగం చూపలేకపోతోంది. అందులో ముఖ్యమైనది రాజధాని. గడచిన తొమ్మిది నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. నిజానికి, అమరావతిపై అనుమానాలు రేకెత్తించింది జగన్‌ ప్రభుత్వమే. సాక్షాత్తూ మంత్రులే రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఆ తర్వాత వ్యవహారం అందరికీ తెల్సిందే. మూడు రాజధానుల అంశం గత రెండు నెలలుగా నానా యాగీకి కారణమవుతోంది.

పోలవరం ప్రాజెక్టు సహా అనేక కీలక అంశాలపై రాష్ట్ర ప్రజానీకంలో చర్చ చాలా జోరుగా సాగుతోంది. ‘సంక్షేమ పథకాలు ఎవరు అధికారంలో వున్నా అందుతాయి.. కొత్త ప్రభుత్వాలు వస్తే, పెన్షన్లు పెరగడం సర్వ సాధారణమే. కానీ, కొత్త పేర్లు తెరపైకి తెస్తూ, జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు..’ అనే అభిప్రాయం రాష్ట్ర ప్రజానీకంలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ విషయాన్ని అధికార పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటున్నా, అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు.

‘జగన్‌ తాను చెయ్యాలనుకున్నది చేస్తారు తప్ప.. దానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే సహించలేరు.. అది పార్టీ నేతలు చెప్పినాసరే..’ అని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయ్‌.. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైఎస్‌ జగన్‌, పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయనీ, పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతోందనీ వైసీపీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...