గ్రౌండ్ రియాల్టీ: జనసేన ‘పవర్’ అనూహ్యంగా పెరిగింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,247FansLike
57,764FollowersFollow

గెలిచేదాకా ఒక లెక్క.. గెలిచాక ఇంకో లెక్క.! ఔను, జనసేన పార్టీకి గ్రౌండ్ లెవల్‌లో ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన ఇది.! ‘ఆయన కూడా ఇతర రాజకీయ నాయకుల్లానే అనుకున్నాం.. కానీ, ఆయన భిన్నం. పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్..’ అంటూ ఊరూ వాడా జనం చర్చించుకుంటున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పంచాయితీ రాజ్ సహా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగా డిప్యూటీ సీఎం అంటే, ఒకప్పుడు ‘పేపర్ వెయిట్’ అనే భావన వుండేది. గత ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంలకు దక్కిన గౌరవం అంత హేయమైనది.

కానీ, ఇప్పుడు పరిస్థితి వేరే. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాల నేపథ్యంలో హోం శాఖ పని తీరుని జనసేనాని ప్రశ్నించిన తీరు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చిపెట్టింది. ‘పవన్ కళ్యాణ్ మాటల్లో తప్పేముంది.?’ అని సాక్షాత్తూ హోంమంత్రి స్పందించిన దరిమిలా, ‘ఇలా అడిగే నాయకుడు లేకనే అఘాయిత్యాలు పెరుగుతూ వచ్చాయ్..’ అని జనం పవన్ కళ్యాణ్‌కి ‘జై’ కొట్టారు.

ఇక, గ్రామాల్లో సీసీ రోడ్లు సహా, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, సర్పంచ్‌లకు దక్కుతున్న గౌరవం.. ఆయా శాఖల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా పని చేస్తున్న తీరు.. ఇవన్నీ, పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమని జనం బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ప్రజల్లో జనసేనాని పొందగలిగారు.. తన చర్యల ద్వారా.

విజయవాడలో వరదలొస్తే, కోటి రూపాయల ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్‌కి ప్రకటించడంతోపాటు, మరో నాలుగు కోట్లు ఆయా గ్రామాల్లో ప్రజావసరాల నిమిత్తం ఖర్చు చేసేందుకు విరాళమిచ్చి జనసేనాని మిగతా రాజకీయ నాయకుల కంటే చాలా భిన్నం.. అనే గుర్తింపు సంపాదించుకోగలిగారు.

చూస్తుండగానే రోజులు, నెలలు గడిచిపోతున్నాయ్. ఏ సమస్య తన దృష్టికి వచ్చినా, క్షణాల వ్యవధిలో ఆ సమస్యలకు పరిష్కారం వెతికేందుకు జనసేనాని చేస్తున్న కృషి నిజంగానే అభినందనీయమని జనం మాట్లాడుకుంటున్నారు. 2019 ఎన్నికల్లోనే జనసేనానిని గెలిపించుకుని వుంటే బావుండేదన్నది రాష్ట్ర ప్రజల భావన.

మరీ ముఖ్యంగా, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ‘మేం ఆయన్ని గెలిపించుకోలేకపోయాం..’ అని గాజువాక, భీమవరం ప్రజలు ఆవేదన చెందుతున్నారంటే, ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం పట్ల జనసేనాని చూపిస్తున్న శ్రద్ధ అలాంటిది.

తాజాగా, రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి ‘సీజ్ ది షిప్’ అంటూ జనసేనాని నినదించిన వైనం, ఆయన గట్స్‌కి నిదర్శనం. నాయకులు గెలుస్తారు, ఓడుతారు.. ప్రభుత్వాలు వస్తాయ్ పోతాయ్.. కానీ, పవన్ కళ్యాణ్ ఈజ్ సమ్‌థింగ్ వెరీ స్పెషల్.!

21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్ సభ సీట్లతోనే జనసేన పార్టీ ఈ స్థాయి మార్పుని చూపించగలుగుతోందంటే, ఈ సీట్ల సంఖ్య మరింత పెరిగితే, రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందన్నది నిర్వివాదాంశం.

సినిమా

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రాజకీయం

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

ఏపీ విద్యకు కొత్త దిశ: ప్రపంచానికి ఆంధ్ర మోడల్ చూపుదాం – లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని బలోపేతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా “ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్”ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

ఎక్కువ చదివినవి

భావ రస నాట్యోత్సవం 2కు రంగం సిద్ధం

హైదరాబాద్‌లో శాస్త్రీయ నృత్య కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ‘భావ రస నాట్యోత్సవం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28, 2026న...

Chiranjeevi: ‘చిరంజీవి దోశ “మల్లెపూవు”లా ఉంటుంది..’ జ్ఞాపకాలు పంచుకున్న నటి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే గుర్తొచ్చేది డ్యాన్స్, ఫైట్స్, కామెడీ. అయితే.. చిరంజీవి అంటే గుర్తొచ్చేవి మరొక విషయం ఆయన వేసే దోశ. ‘చిరంజీవి దోశ’గా ఆయనకు పేటెంట్ కూడా ఉంది. ఆయనకు...

శ్యామల కామెంట్‌కు జనసేన దిమ్మదిరిగే కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్‌సీపీ నేత ఆరే శ్యామల చేసిన వ్యాఖ్యలకు జనసేన నుంచి దిమ్మదిరిగే స్థాయిలో ఘాటైన కౌంటర్ రావడంతో రాజకీయ వర్గాల్లో...

విరోష్ రిసెప్షన్‌కి ఆహ్వానం ఉన్నవారికే ప్రవేశం

ఇండియాలోనే అత్యంత క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్‌గా నిలిచిన విరోష్ వివాహ వేడుకలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈ నెల 4న సాయంత్రం విజయ్...

సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన సభ్యత్వ జోరు

తెలంగాణ పరిధిలో విలీన ప్రక్రియ అనంతరం కొత్తగా నిర్ణయించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రాంతంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో...