Switch to English

కరోనా కంటే ‘కిరాతకంగా’ చంపేస్తోంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

దీన్ని నిర్లక్ష్యం అనాలా.? నిర్లక్ష్యమే అయితే అది పాలకులదేనా.? ఖచ్చితంగా పాలకులదే ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఒక్క పూట పని లేకపోతే పూటగడవుదు దేశంలో కోట్లాదిమంది పేదలకి. అలాంటిది దాదాపు రెండు నెలలపాటు ‘లాక్‌డౌన్‌’ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ‘ఛస్తే ఛస్తాం.. అదేదో సొంతూరిలో.. సొంత మనుషుల మధ్యనే చచ్చిపోవాలి..’ అంటూ వలస కూలీలు తమ సొంతూళ్ళకు వెళుతున్నారు. ఈ క్రమంలో వారికి వాహనాలు దొరకడంలేదు. రోడ్డుని పట్టుకుని, రైలు పట్టాల్ని పట్టుకుని.. అడుగులో అడుగేసుకుంటూ వెళుతున్నారు.

మొన్న, మృత్యువు రైలు రూపంలో దూసుకొచ్చింది.. 20 మందికి పైగా వలస కూలీల్ని పొట్టన పెట్టేసుకుంది. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం 20 మందికి పైగా వలస కూలీల్ని బలి తీసుకుంది. ఇవి లెక్కల్లోకి వచ్చిన ‘పెద్ద ఘటనలు’. లెక్కల్లోకి రాని ఘటనలెన్ని.? అసలు ఇటీవలి కాలంలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.? లెక్కలు తీస్తే, అత్యంత భయనాకం.. అంటూ పలు సర్వేలు చెబుతున్నాయి. ‘కరోనా వైరస్‌ కంటే కిరాతకమైనదీ నిర్లక్ష్యం అనే వైరస్‌.. ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి’ అనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌ అయ్యింది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మెయిన్‌టెనెన్స్‌ లోపం తలెత్తి ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తేల్చారు. 12 మంది ప్రాణాలు కోల్పోవడానికి లాక్‌డౌన్‌ కారణమయ్యిందంటే.. పరోక్షంగా ఈ మరణాలు కూడా కరోనా ఖాతాలోనే వేసెయ్యాలి.

కరోనా వైరస్‌తో ప్రత్యక్షంగా మరణించేవారికి అదనంగా, ఈ పరోక్ష చావుల్నమాట. అంటే, ప్రత్యక్ష చావుల కంటే, పరోక్ష చావులే అత్యంత దారుణంగా వుంటున్నాయన్నమాట. ‘వలస కూలీల్ని సొంతూళ్ళకు పంపించేందుకు వాహణాలు సమకూరుస్తున్నాం.. బస్సులు, రైలుళ్ళు తిప్పుతున్నాం..’ అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, ఆ ఏర్పాట్లు సరిపోవడంలేదు. ఎలా సరిపోతుంది.? కోట్లాదిమంది బాధితులుంటే.. వేలాది మందికి మాత్రం ఆ సౌకర్యాలు అందుబాటులో వుంటున్నాయి. ఎక్కడికక్కడ ఆగిపోయినవారికి కనీసం భోజనం పెట్టలేని దుస్థితిని ఏమనుకోవాలి.? లక్షల కోట్ల ప్యాకేజీలు.. ఎవడి కోసం.? పేదవాడికి ముద్ద పెట్టలేని ప్యాకేజీలతో దేశానికి జరిగే మేలు ఏంటి.? ఛస్తామని తెలిసీ.. అత్యంత భయానకమైన పరిస్థితుల్లో వలస జీవులు నడుచుకుంటూ వెళుతున్నారంటే దేశం సిగ్గుపడాల్సిన సందర్భమిది.

ఓ పచ్చి బాలింత.. 100 కిలోమీటర్ల దూరం నడిచింది.! గర్భిణిగా బయల్దేరి, మార్గమద్యంలో బడ్డను ప్రసవించి, ఆ బిడ్డను పట్టుకుని మళ్ళీ నడవాల్సి వచ్చింది ఆ అభాగ్యురాలికి. ప్రభుత్వాలు చెప్పే మాటలకి.. వాస్తవ పరిస్థితులకీ పొంతన లేదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

రాజకీయం

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

ఎక్కువ చదివినవి

Ustaad Bhagat Singh : గ్లాస్ డైలాగ్‌ ని బలవంతంగా చెప్పించాడు : పవన్‌

Ustaad Bhagat Singh : పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉస్తాద్‌ భగత్ సింగ్ టీజర్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ లో పవన్ కళ్యాణ్‌...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత: పిఠాపురం ఎవరిది.?

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు పోటీగా,...

పిఠాపురంలో ‘వర్మ’ కెలుకుడు వెనక వున్నదెవరు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గమది. ‘ఆ నియోజకవర్గం నాదే..’ అని చెప్పుకుంటున్నారు టీడీపీ నేత వర్మ. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గం అది. సరే, రాజకీయాల్లో గెలుపోటములు...

ఇన్‌స్టా రికార్డుల్లో కూడా తగ్గేదేలే.. అంటున్న ఐకాన్‌స్టార్

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్‌, ఆయ‌నకున్న క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప చిత్రంతో అంత‌ర్జాతీయంగా అభిమానుల‌ను సంపాందించుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ రోజు రోజుకు త‌న పాపులారిటీని పెంచుకుంటూనే పోతున్నాడు. ప్ర‌తి...