ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మూవీ విడుదల కాకుండానే ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. సోషియో ఫాంటసీ కథాంశంతో నాగ్ అశ్విన్ ప్రభాస్ 21వ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ ఏడాది సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తానంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా నమ్మకంగా చెప్పాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది సాధ్యం అయ్యేలా లేదు.
నాగ్ అశ్విన్ లాక్ డౌన్ తో సర్వం బంద్ ఉన్నా కూడా ప్రభాస్ 21 చిత్రం స్క్రిప్ట్ విషయంలో తన టీంతో రోజూ ఆన్ లైన్ ద్వారా చర్చలు జరుపుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునేను సంప్రదించారనే టాక్ కూడా వినిపిస్తుంది. బాలీవుడ్లో ప్రస్తుతం ఆమెకున్న క్రేజ్ నేపథ్యంలో ప్రభాస్తో నటించేందుకు ఏకంగా పాతిక కోట్ల రూపాయలను పారితోషికంగా అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం హీరోయిన్కు బడ్జెట్లో ఏడు నుండి పది కోట్లు మాత్రమే కేటాయించాడని తెలుస్తోంది.
దీపిక పదుకునే భారీ రెమ్యూనరేషన్ను డిమాండ్ చేయడంతో మరో బాలీవుడ్ హీరోయిన్తో ఆయన చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కీర్తి సురేష్ను కూడా ప్రభాస్కు జోడీగా దర్శకుడు నాగ్ అశ్విన్ పరిశీలించాడని, ప్రభాస్తో ఫొటో షూట్కు కూడా కీర్తి సురేష్ను రెడీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై స్పష్టత రాకుండానే మళ్లీ ఈ కొత్త పుకార్లు పుట్టుకు వచ్చాయి. చివరకు ప్రభాస్కు జోడీగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవరిని ఖరారు చేస్తాడో..!
432397 157531Cheapest player speeches and toasts, or possibly toasts. continue to be brought about real estate . during evening reception tend to be likely to just be comic, witty and therefore instructive as effectively. best man speeches no cost 823331
652269 315530There several fascinating points in time in this post but I dont know if I see these center to heart. There could be some validity but Ill take hold opinion until I explore it further. Superb write-up , thanks and then we want a whole lot a lot more! Put into FeedBurner too 20766